దుర్గమ్మకు పూజలు

అమ్మవారిని దర్శించుకుంటున్న హైకోర్టు ఉప లోకాయుక్త జడ్జి నిరంజనరావు దంపతులు - Sakshi

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైకోర్టు ఉప లోకాయుక్త జడ్జి నిరంజనరావు దంపతులు, సంగారెడ్డి జిల్లా ఎలక్షన్‌ అబ్జర్వర్‌, లక్నో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఏడుపాయల ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు, పూజారులు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top