Sakshi News home page

రాబోయేది కాంగ్రెస్సే

Published Sat, Nov 18 2023 12:10 AM

-

‘తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. కాంగ్రెస్‌ తుఫాను ఇక్కడ రాబోతుందని కేసీఆర్‌కు ఇప్పటికే అర్థమైంది. ఈ సభలో ఊపుతున్న చేతులే అందుకు తార్కాణం. మనం గట్టిగా చేతులు ఊపితే రాష్ట్రంలో కేసీఆర్‌, ఆయన పార్టీ కనిపించకుండా పోతుంది.’ అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. మణుగూరులో శుక్రవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని, కానీ ఇప్పుడు దొరల తెలంగాణ రాష్ట్రంలో కొలువైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలన్నీ ఒక కుటుంబానికే పరిమితమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తోందని తెలిపారు. ధరణి వల్ల నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్‌ ఇంట్లోనే వస్తుంది తప్పితే మిగిలిన చోట్ల రావడం లేదని రాహుల్‌ విమర్శించారు. ఎప్పుడూ ఇంటి గడప దాటని కేసీఆర్‌కు రాష్ట్రంలో ఉన్న కరెంటు కష్టాలు తెలియవన్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

What’s your opinion

Advertisement