శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవం | Sakshi
Sakshi News home page

శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవం

Published Sat, Dec 2 2023 1:08 AM

- - Sakshi

కొత్తపల్లి: పట్టణంలో నవంబర్‌ 24 నుంచి శుక్రవారం వరకు భాగవత శ్రావణం త్రిదండి అహోబిల జీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నరహరి నారాయణరెడ్డి సౌజన్యంతో భాగవత సప్తహ పూర్తి చేసుకుని రుక్మిణి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిన్న జీయర్‌స్వామి హాజరయ్యారు. అహోబిల జీయర్‌ స్వామి చిన్న గుట్టపైకి వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికి చిన్న జీయర్‌స్వామిని ఆలయ ప్రతిష్ఠకు తీసుకు వస్తానని తెలిపారు. ఈ ఉత్సవాల్లో నారాయణరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు జనార్దన్‌రెడ్డి, బండ గోపాల్‌రెడ్డి, రిటైర్డ్‌ తహసీల్దార్‌ శ్రీధర్‌రెడ్డి, గౌతమ్‌రావు, భోగ సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement