సౌత్‌ జోన్‌ కబడ్డీ పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

సౌత్‌ జోన్‌ కబడ్డీ పోటీలకు ఎంపిక

Published Tue, Nov 21 2023 12:40 AM

ఎంపికై న ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు
 - Sakshi

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: తమిళనాడులోని అలగప్ప యూనివర్సిటీలో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే సౌత్‌ జోన్‌ అంతర్‌ యూనివర్సిటీ స్థాయి కబడ్డీ పోటీలకు కరీంనగర్‌లోని డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన శాతవాహన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని డి.వాసవి, ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు పి.అనూష, వి.రమ్య, జి.సాయిప్రియలు రాణించారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.శ్రీలక్ష్మి, ఫిజికల్‌ డైరెక్టర్లు శ్రీధర్‌రావు, శ్రీనాథ్‌రెడ్డి, వివేకానంద కళాశాల కరస్పాండెంట్‌ ఆగంరావు, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు, తోటి విద్యార్థులు సోమవారం అభినందించారు.

వాసవిని అభినందిస్తున్న యాజమాన్యం
1/1

వాసవిని అభినందిస్తున్న యాజమాన్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement