‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’ | Sakshi
Sakshi News home page

‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’

Published Tue, Apr 23 2024 8:15 AM

ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ - Sakshi

కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం ఆయన క్యాసంపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకంలో ఎలాంటి తేడాలు రాకుండా చూడాలన్నారు. తూకం వేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 241 కేంద్రాల ద్వారా 11,723 మంది రైతులనుంచి రూ.161.70 కోట్ల విలువైన 73,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.55.27 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి వెంటనే బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ నిత్యానందం, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement