బీజేపీ వైఫల్యాలను వివరించాలి | Sakshi
Sakshi News home page

బీజేపీ వైఫల్యాలను వివరించాలి

Published Tue, Apr 23 2024 8:15 AM

బస్వన్నపల్లిలో రివ్యూమీటింగ్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌  - Sakshi

రాజంపేట : బీజేపీ వైఫల్యాలు, బీబీపాటిల్‌ అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే మదన్‌మోహన్‌ కార్యకర్తలను ఆదేశించారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలంలోని ఆయా గ్రామాల అధ్యక్షులతో, యూత్‌ అధ్యక్షులతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఒక్కరితో నేరుగా రివ్యూ చేసి ఇప్పటిదాకా ఎన్ని ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చేలా కృషి చేశారనే విషయాన్ని తెలుసుకున్నారు. మండల స మావేశాల్లో చెప్పిన పనులను పూర్తి చేయని వారిని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సుమారుగా తమ వ్యక్తి గతంగా 50 నుండి 60 ఓట్లు తమ బాధ్యతగా తీసుకొని ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూ చించారు. అనంతరం బస్వానపల్లి, ఆర్గోండ, కొండాపూర్‌, గుండారం, సిద్ధాపూర్‌ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి షెట్కార్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రణీత్‌ రెడ్డి, యూత్‌ అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరి సంతోష్‌ రెడ్డి తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement