మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం | Sakshi
Sakshi News home page

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం

Published Sun, Nov 19 2023 1:20 AM

కోటగిరిలో మాట్లాడుతున్న పోచారం  - Sakshi

రుద్రూర్‌: మాటలు చెప్పడం కాదు.. పనులు చేసి చూపిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తనకు ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. కోటగిరి మండలంలోని సుద్దులం, సుద్దులం తండా, రాంపూర్‌, కోటగిరి, ఎత్తొండ, యాద్‌గార్‌పూర్‌, దోమలెడ్గి, వల్లాభపూర్‌ గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాయమాటలు చెప్పే వారు వస్తున్నారని వారిని నమ్మొద్దని కోరారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం పలు కుల సంఘాల సభ్యులు ఏకగ్రీవ తీర్మాన ప్రతులను స్పీకర్‌కు అందజేశారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్‌, ఎంపీపీ సునీతాశ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌ పటేల్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్‌, రైతు బంధు సమితి మండల కో–ఆర్డినేటర్‌ కిశోర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ బాన్సువాడ అభ్యర్థి

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
Advertisement