ప్రియుడిపై హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై హత్యాయత్నం

Published Fri, Apr 19 2024 2:40 AM

రాజమహేంద్రవరం ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చయ్య - Sakshi

దేవరపల్లి: ఒక ప్రియుడి సాయంతో మరొక ప్రియుడిపై హత్యాయత్నం చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యర్నగూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ ఇద్దరు ప్రియులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన శీల బుచ్చయ్యతో పాటు మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుండగా ఇద్దరి ప్రియుల మధ్య కక్షలు పెరిగాయి. ప్రియుడు శీల బుచ్చయ్యను అడ్డుతొలగించుకోవడానికి మహిళ మరొక ప్రియుడితో కలిసి పథకం రూపొందించింది. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో బుచ్చయ్యకు ఫోన్‌ చేసి ఊరు చివర నిర్మానుష్య ప్రాంతానికి రప్పించింది. అక్కడ మహిళ, మరొక ప్రియుడు కలిసి బుచ్చయ్యపై కత్తితో దాడి చేశారు. కుడికాలు చీలమండ, తలపైన, నరికి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం ప్రియుడు, ప్రియురాలు అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో ఉన్న బుచ్చయ్యను 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై కె. శ్రీహరిరావు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement