Sakshi News home page

రేపటి నుంచి రాములోరి బ్రహ్మోత్సవాలు

Published Sat, Apr 13 2024 1:20 AM

కోదండరామస్వామి ఆలయం   
 - Sakshi

ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు శుక్రవారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, అంకురార్పణ, 15న ధ్వజారోహణం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం, 16న శ్రీ ధన్వంతరి హోమం, శ్రీ సుదర్శన హోమం, 17న సీతారాముల కల్యాణం, రథోత్సవం, 18న రామచంద్రుల వారి సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 19న చక్రస్నానం, మహాపూర్ణాహుతి, శ్రీపుష్పయాగం, ధ్వజారోహణం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

17న బీచుపల్లిలో సీతారాముల కల్యాణం

Advertisement
Advertisement