ఆరోగ్యమే మహాభాగ్యం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Published Mon, Apr 8 2024 1:20 AM

 ఖైదీలకు పండ్లు పంపిణీ చేస్తున్న సబ్‌ జడ్జి ప్రసాద్‌ - Sakshi

జగిత్యాలజోన్‌: ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సబ్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్‌ అన్నారు. జగిత్యాల స్పెషల్‌ సబ్‌ జైల్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్‌ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో బయటకు వెళ్లిన తర్వాత వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదించినట్లేనని తెలిపారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పి.సతీష్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ఆర్‌.విజయ్‌ కృష్ణ, హర్షవర్ధన్‌, జైలర్‌ మొగిలేశ్‌, ఖైదీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement