బైక్‌ను ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి

Published Mon, Apr 8 2024 1:45 AM

లారీ కింద మోటార్‌ సైకిల్‌  - Sakshi

పరారీలో లారీ డ్రైవర్‌

రొంపిచర్ల : మండలంలోని అన్నవరప్పాడు గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి వైపు నుంచి పిడుగురాళ్ల వైపు వేగంగా వెళ్తున్న లారీ మోటారు బైక్‌ను ఢీకొట్టడంతో ఈపూరు మండలం గోపువారిపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ మొండితోక బాలశౌరి(53) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన రాయల వెంకటేశ్వర్లు(75)లు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతులు గోపువారిపాలెం నుంచి మోటార్‌ బైక్‌పై తురిమెళ్ల గ్రామంలో ప్రార్థనలు నిర్వహించేందుకు వచ్చారు. అక్కడ ముగించుకొని ప్రకాశం జిల్లా సంతమాగులూరు అడ్డరోడ్డు గ్రామంలో ప్రార్థనలో పాల్గొనేందుకు బైక్‌పై బయలు దేరారు. అన్నవరప్పాడు గ్రామం సమీపంలోని బ్రిడ్జి దిగువ భాగంలో యూటర్న్‌ తీసుకుంటుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. మృతదేహాలను పంచనామ నిర్వహించేందుకు నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు బాలశౌరి కుమారుడు బాబూరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.పి.రవీంద్రబాబు తెలిపారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

రాయల వెంకటేశ్వర్లు
1/2

రాయల వెంకటేశ్వర్లు

మొండితోక బాలశౌరి
2/2

మొండితోక బాలశౌరి

Advertisement
Advertisement