నేటి నుంచి రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Published Wed, Nov 15 2023 12:54 AM

-

పెదకాకాని: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు వెనిగండ్ల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ప్రారంభమవుతాయని వ్యాయామోపాధ్యాయుడు మస్తాన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా , పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జిల్లా జట్టుకు ఎంపికై న 500 మంది బాల బాలికలు (క్రీడాకారులు)పాల్గొంటారన్నారు. అండర్‌ 17, అండర్‌ 14 విభాగాలలో బుధ, గురు, శుక్రవారాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల నిర్వహణలో 13 జిల్లాల నుంచి 50 మంది స్పోర్ట్స్‌ మేనేజర్లు, 50 మంది వ్యాయామోపాధ్యాయులు పాల్గొంటారన్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు అతిథుల చేతుల మీదుగా రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభమవుతాయని పీఈటీ మస్తాన్‌రెడ్డి వివరించారు.

Advertisement
Advertisement