హోమ్‌ ఓటింగ్‌కు చివరి అవకాశం | Sakshi
Sakshi News home page

హోమ్‌ ఓటింగ్‌కు చివరి అవకాశం

Published Tue, Apr 23 2024 8:30 AM

-

ఏలూరు(మెట్రో): పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు హోమ్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. 85 ఏళ్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ మేరకు అర్హుల ఇంటి వద్దకే వెళ్లి బీఎల్‌ఓలు ఫారం–12(డి) అందిస్తున్నారన్నారు. దరఖాస్తును పూరించి ఈనెల 23లోపు సెక్టోరల్‌ అధికారులకు అందించాలన్నారు. వీటిని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించి వచ్చేనెల 2 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పిస్తారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement