పేదల సంక్షేమమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే లక్ష్యం

Published Sat, Nov 25 2023 12:26 AM

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆళ్ల నాని   - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇంటి స్థలాన్ని మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం తాపీమేసీ్త్ర కాలనీ, సుందరయ్య కాలనీలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో 30 వేల ఇళ్ల పట్టాలు అర్హులైన పేదలకు అందజేశామన్నారు. ఇప్పటికే పేదలకు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని పేద కుటుంబం ఉండకుండా చేయడమే ప్రధాన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పార్టీ జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, డిప్యూటీ మేయర్‌ గుడిదేశి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సన్నీ, తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement