రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత, వాతంగి సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న 11 మంది వలంటీర్లు శుక్రవారం రాజీనామా పత్రాలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఇప్పటికే జడ్డంగి, వాతంగి, చికిలింత, వంచంగి సచివాలయల్లో రాజీనామాలు చేసిన వారి సంఖ్య 78 కి చేరిందని ఎంపీడీవో ఎల్. యాదగిరీశ్వరరావు విలేకరులకు తెలిపారు.
వై.రామవరం: మండలంలోని దేవరమడుగులు గ్రామ సచివాలయానికి చెందిన ఇద్దరు గ్రామ సచివాలయ వలంటీర్లు శుక్రవారం విధులకు రాజీనామ చేశారు. ఆగ్రామానికి చెందిన బట్ట వెంకటలక్ష్మి, పొత్తూరి బాలరాజు కలిసి రాజీనామా పత్రాలను సచివాలయ మహిళా పోలీసు డి.చిన్నయమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు చంద్రబాబు గ్రామ వలంటీర్లపై చేసిన దారుణమైన వ్యాఖ్యలు భరించలేకే రాజీనామ చేశామన్నారు. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన తాము జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.
1/1
రాజవొమ్మంగిలో రాజీనామా పత్రాలు
అందజేస్తున్న వలంటీర్లు