బ్యాడ్మింటన్‌ పోటీలకు అరకు స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ పోటీలకు అరకు స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు

Published Thu, Nov 9 2023 12:24 AM

-

అరకులోయ టౌన్‌: రాష్ట్ర స్థాఽయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–17 బ్యాడ్మింటన్‌ పోటీల్లో అరకులోయ స్పోర్ట్స్‌ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే పోటీలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల విద్యార్థులు వి. అజిత్‌ కుమార్‌, పి.గౌతమ్‌ ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌, కోచ్‌ కె. రాజుబాబు విద్యార్థులను అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement