‘స్పందన’కు అర్జీల వెల్లువ | Sakshi
Sakshi News home page

‘స్పందన’కు అర్జీల వెల్లువ

Published Tue, Mar 28 2023 1:10 AM

అర్జీలు స్వీకరిస్తున్న పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌    - Sakshi

రంపచోడవరం: వై.రామవరం మండలంలోని గిరిజనులు ఉపాధి హామీ పథకం ద్వారా రబ్బరు మొక్కలు సరఫరా చేయాలని స్పందన కార్యక్రమంలో సోమవారం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరేను కోరారు. ఐటీడీఏ సమావేశపు హాలు పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌తో కలిసి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో సూరజ్‌ గనోరే మాట్లాడుతూ స్పందనకు 24 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దేవీపట్నం మండలం శరభవరం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు 2019లో వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా ఇవ్వలేదన్నారు. మట్లపాడు–అప్పలపాడు గ్రామాల మధ్య కాలువపై కల్వర్టు నిర్మించాలని గిరిజనులు కోరారు. పలువురు భూ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేసినట్టు తెలిపారు. ఎస్‌డీసీ జాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement