ఆరోగ్యమే మహాభాగ్యం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Published Mon, Apr 8 2024 1:30 AM

మందులు అందిస్తున్న అదనపు జడ్జి శివరాంప్రసాద్‌
 - Sakshi

బేల: ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా అదనపు జడ్జి శివరాం ప్రసాద్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్యర్యంలో మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని సూచించారు. అంతకముందు చెవి, ముక్కు, గొంతు, కళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య నిపుణులతో పరీక్షలు చేయించారు. ఇందులో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌ పాండే, మండల పంచాయతీ అధికారి మహేశ్‌, బేల పీహెచ్‌సీ వైద్యాధికారి వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement