-
భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున చామల కిరణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పోటీలో ఉన్నారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీబీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి బూరభువనగిరిలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్ఎస్ లోని పాత పరిచయాలతో క్రాస్ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్ చరిష్మా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇస్తోంది. సెమీ అర్బన్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధి సెమీ అర్బన్గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్కు ఈస్ట్కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది. పోటీలో సీపీఎం రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది. ప్రభావితం చేసే అంశాలు పెండింగ్ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ జాప్యం కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 2019 లోక్సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్) 5,32,795 (44.37 శాతం) బూరనర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) 5,27,576 (43.94 శాతం) పీవీ శ్యాంసుందర్రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం) -
కాషాయ జెండాలు కడుపు నింపుతయా?
సాక్షి, యాదాద్రి: దేశంలో ఎన్నో సమస్యలుంటే మోదీ ప్రభుత్వానికి అక్షింతలు కలుపుడు, తీర్థం పుచ్చుకునుడు, పులిహోర పొట్లాలు తినుడుతోనే సరిపోయిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని.. కానీ గత పదేళ్లలో ఏ ఒక్క వర్గం ప్రజలకూ న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఈ కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతాయా, పొలాలకు నీళ్లు తెస్తయా అని విమర్శించారు. బీజేపీ హయాంలో పెద్దపెద్ద నేరాలు జరిగాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే మొదటి శత్రువని.. ఆ పార్టీ వల్ల 58ఏళ్లు అనేక కష్టాలు పడ్డామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తానని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర గురువారం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ పట్టణంలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని.. లేకుంటే ఎమ్మెల్యేలను కొంటాం.. నన్ను దించేస్తామని మోదీ బెదిరించారు. ఈ రాష్ట్రానికి వచ్చే రూ.25 వేల కోట్లు ఇవ్వబోమన్నారు.. ఇదే బీజేపీ దందా. కానీ నా తలకాయ తెగిపడ్డా సరే బోర్లకు మీటర్లు పెట్టనని చెప్పిన. రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మోదీ సర్కారు తెలంగాణకు నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. పదేళ్లు కష్టపడి నిలబెట్టిన 1956 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ శత్రువు కాంగ్రెస్ పార్టీ. భువనగిరి, ఆలేరు, జనగామ ప్రాంతాలు ఎంతో గోసపడ్డాయి. వలస లు, అనేక రకాల బాధలు ఉండేవి. ఎవరూ ధైర్యం చేయ కపోయినా తెలంగాణ డెవలప్ కావాలని ఉద్యమం ప్రారంభించిన. 15 ఏళ్లు కొట్లాడిన. చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని కష్టపడి నిలబెట్టిన. మంచి పథకాలు పెట్టిన. రైతుబంధు, 24గంటల విద్యుత్ ఇచ్చినం. నీళ్లు ఇచ్చుకున్నాం. ఒక్క గింజ మిగలకుండా ధాన్యం కొనుగోళ్లు చేసినం. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. రూ.15 వేలు రైతు బంధు, 2లక్షలు రుణ మాఫీ అన్నారు. రైతుబంధు అందరికీ వచ్చిందా? 5 ఎకరాలకే ఇస్తామంటూ దగా చేస్తున్నరు. మంచిగున్న కరెంటును నాశనం చేసి పొలాలను ఎండబెడుతున్నరు. ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ చేస్తున్నరు. బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగినయ్. కాంగ్రెస్ రాగానే 225 మంది రైతులు చనిపోయారు. రైతుబీమా దిక్కే లేదు. వరికి రూ.500 బోనస్ ఏది? మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఏది? ఆడపిల్ల లకు స్కూటీలు ఏమైనయ్? కల్యాణలక్ష్మి తులం బంగారం ఏది? మంచిగున్న తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా? పోరాడాలా? కేసీఆర్ను కిందపడేసి కొట్లాడుమంటే ఎట్లా? బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతాం’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ను పుట్టించిండు ‘‘భగవంతుడు కేసీఆర్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. తెలంగాణ ప్రజల గుండె చీల్చితే కనిపించేది కేసీఆర్.. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలు. కొట్లాడటానికి బలం కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే లోక్సభలో మోదీపై ఫైటింగ్ చేస్తరు. భువనగిరిలో బలహీన వర్గాలకు చెందిన క్యామ మల్లేశ్ను గెలిపించండి. మా వయసు మీరిపోతోంది. ఈ తెలంగాణ మీది.. ముందుకు నడిపేది మీరు.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో వారికి ఓటు వేయండి’’ అని యువతకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓట్లు.. ఒట్లు.. ఇదే తీరు? ‘‘ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది. ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టుపెట్టుకుంటోంది. ఒకడేమో ఓట్లు.. ఇంకొకడేమో ఒట్లు అంటున్నరు. మనం అద్భుతంగా యాదాద్రి నిర్మాణం చేసుకున్నాం. ఏనాడైనా యాదగిరిగుట్టను ఓట్ల కోసం వాడుకున్నామా? ఒకడొచ్చి బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు. భువనగిరిలోనేమో బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసిపోయి మున్సిపల్ చైర్మన్ను తీసేసి కాంగ్రెస్ వాళ్లు చైర్మన్, బీజేపీ వాళ్లు వైస్ చైర్మన్ తీసుకున్నారు. మరి ఎవరు ఎవరికి బీ టీమ్ ప్రజలు గుర్తించాలి. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
బీజేపీపై పోరాడే సమయం లేదా?
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు.. కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్ని రేవంత్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన బహిరంగసభలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ, నోరు పారేసుకోవద్దని రేవంత్రెడ్డికి సూచించారు. కేసీఆర్ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, సీఎం రేవంత్ ఆ బాటలో నడవద్దని అన్నారు. కేరళలో బీజేపీ, కమ్యూనిస్టులు కలసి పనిచేస్తున్నారని రేవంత్ పేర్కొనడం అతని అవివేకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కవితను బీజేపీ జైల్లో పెట్టిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ ఇండియా కుటమిలోకి రావాలని సూచించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాఘవులు అన్నారు. మమ్మల్ని కలుస్తామని కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది : తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి అందరితో కలసి వెళ్తామని, ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కలవనున్నట్లు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ తెలంగాణలో భువనగిరి నుంచి సీపీఎం పోటీచేయడం ఖాయమన్నారు. -
పోలీసుల అదుపులో దొంగలు?
సాక్షి యాదాద్రి : జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారని సమాచారం. రెండు నెలలుగా యాదాద్రిభువనగరి జిల్లాలో 15కు పైగా చైన్స్నాచింగ్లు జరిగాయి. దీంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. వలిగొండ మండలం సంగెంకు చెందిన ఇద్దరు యువకులు ఈ వరుస దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన వీరు బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. డీసీసీ రాజేష్ చంద్ర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement