మొబైల్ యాప్స్పై చైనా కొరడా
సామాజిక వెబ్సైట్లపై గతంలో కఠిన వైఖరి అవలంబించిన చైనా.. న్యూస్ సైట్ల విషయంపైనా అదే వైఖరి కొనసాగిస్తోంది. ఇంతకుముందు గూగుల్పై నిషేధం విధించిన డ్రాగన్.. తాజాగా మొబైల్ న్యూస్ అప్లికేషన్స్పై కొరడా ఝుళిపించింది. వార్తా సంస్థలుగా అర్హత లేని వాటిన్నంటినీ నిర్ణీత సమయంలోగా రద్దు చేయాలని నిర్ణయించింది. చైనా స్టేట్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ (ఎస్ఐఐఓ) సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని మొబైల్ న్యూస్ యాప్స్ ఎలాంటి అర్హతలు లేకుండా ఇంటర్నెట్ రెగ్యులేటర్ల ద్వారా వార్తా సేవలు అందిస్తున్నాయని ఎస్ఐఐఓ పేర్కొంది. కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని కూడా చేరవేస్తున్నాయని వెల్లడించింది. కొన్ని యాప్స్ అయితే ఏకంగా పోర్నోగ్రఫీని కూడా ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. వార్తల సేకరణ విధానం సముచితంగా లేదని తప్పుపట్టింది. ఇలాంటి సమాచారం అందిచడం వల్ల యువత పెడధోరణ పట్టే ప్రమాదముందని ఎస్ఐఐఓ హెచ్చరించింది. అర్హత లేని మొబైల్ యాప్స్పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారుల్ని ఆదేశించింది.