-
సూపర్హిట్
జనమే జనం.. పోటెత్తిన అభిమాన ప్రవాహం.. రోడ్లకిరువైపులా జనం బారులు.. మహిళల హారతులు.. పూలవర్షాలతో కనీవినీ ఎరుగని అఖండ స్వాగతం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు సాగిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో కనిపించిన దృశ్యాలివి.. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అడుగడుగునా అశేష జనవాహిని నడుమ సాగిన బస్సుయాత్ర ప్రతిపక్ష పార్టీల గుండెల్లో వణుకు పుట్టించింది. సంక్షేమ రథసారధి.. దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ప్రజలు ఉత్సాహం చూపించగా.. ఆయనే స్వయంగా బస్సు దిగి ఆప్యాయంగా పలకరించడం.. ‘నేను ఉన్నానంటూ’ భరోసా కల్పించడంతో శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖలో అడుగుపెట్టింది మొదలు ప్రజలు అదే ప్రేమాభిమానాలు కురిపించారు. జై జగన్ అంటూ నినదించారు. పేదల ప్రతినిధికి జేజేలు పలికారు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడంతే అని నమ్మిన ప్రజలు స్వచ్ఛందంగా జగనన్న చూసేందుకు తరలివచ్చారు. జగనన్న మాటకు.. బాటకు ప్రజలు విలువ ఇస్తున్నారు. ఆయన ఒక్క అడుగు వేస్తే.. లక్షలాది పాదాలు ఆయనను అనుసరించాయి. అందుకే మేమంతా సిద్ధం బస్సుయాత్ర జనజాతర తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్కున చేర్చుకున్న జనం ‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తా. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తూ.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానంటూ ఇటీవల జరిగిన విజన్ విశాఖ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.. అందుకే అన్నొస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ జనం విశ్వసించారు’.. మేము సిద్ధం యాత్రలో భాగంగా జనంతో మమేకమయ్యేందుకు విశాఖ చేరుకున్న వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభించింది. 2019 ప్రజాసంకల్ప యాత్రలో ఎలాగైతే జనం అక్కున చేర్చుకున్నారో అంతకు మించిన అభిమానాన్ని ఉమ్మడి విశాఖ ప్రజలు మేమంతా సిద్ధం అంటూ చూపిస్తున్నారు. సభలో స్పందన భేష్ బస్సుయాత్రలో భాగంగా ఈ నెల 20న అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన సిద్ధం సభకు వార్ వన్సైడ్ అనే రీతిలో అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, మహిళలు సీఎం వైఎస్ జగన్ మాటలకు కేరింతలు కొట్టారు. జగన్ వెంట మేమంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి కుయుక్తులు, చంద్రబాబు చెబుతున్న అబద్ధాల గురించి జగన్ చెప్పిన మాటలు ప్రజల్లోకి సూటిగా వెళ్లడంతో టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చారు. జనమంతా జేజేలు అనకాపల్లి, విశాఖ జిల్లాలో బస్సుయాత్రకు వచ్చిన ఆదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రెట్టింపైంది. ఈసారీ జెండా రెపరెపలాడేలా జనమంతా జేజేలు పలుకుతుండటటంతో.. అటు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు దూకుడు పెంచారు. ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా చేయా లని నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విజయ ఢంకా మోగబోతోందన్నది స్పష్టమైంది. ప్రతిపక్షాల్లో వణుకు జనమంతా జగన్వైపే ఉన్నారన్న స్పష్టత రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ప్రజలంతా స్వచ్ఛందంగా జగన్ను చూసేందుకు వచ్చిన విషయం తెలుసుకొని టీడీపీ, జనసేన నేతలు కలవరపడుతున్నారు. ఫ్యాన్ గాలికి తట్టుకొని నిలబడటం కష్టమేనన్న సంకేతాలు కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నదానిపై పునరాలోచనలో పడేలా బస్సుయాత్ర జైత్రయాత్రలా సాగింది. ఉమ్మడి విశాఖలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరిగింది. అధినేత పర్యటనతో అనకాపల్లి, విశాఖ జిల్లాలోని అభ్యర్థులు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రతో వైఎస్సార్ సీపీలో జోష్ మేమంతా సిద్ధం అంటూ నినదించిన ప్రజానీకం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం కార్యనిర్వాహక రాజధానికి ఓటేస్తామంటూ చాటిచెప్పిన జనం ప్రతి నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కదిలివచ్చిన ప్రజలు -
పదిలో బాలికలదే హవా
2023 77.742024 89.04పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు దుమ్మురేపాయి. కార్పొరేట్కు దీటుగా ఫలితాలు సాధించి వహ్వా అనిపించాయి. నాణ్యమైన ఉచిత విద్యనందించి మార్కులు కొల్లగొట్టాయి. జిల్లా మొత్తం మీద 89.04 శాతం ఉత్తీర్ణత రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది గణనీయంగా ఉత్తీర్ణత పెరగడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో ఈ ఘనత సాధించగలిగాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా శ్రీలేఖకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను సివిల్స్ పరీక్షలకు వెళ్తానని గట్టెం శ్రీలేఖ అన్నారు. పాయకరావుపేట మండలం గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించానని ఆనందం వ్యక్తం చేసింది. ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్ చదివి అనంతరం సివిల్స్ సాధించడమే ధ్యేయమన్నారు. ఆమె తండ్రి గంగబాబు వృత్తిరీత్యా టైల్స్ వ్యాపారి, తల్లి విజయలక్ష్మి గృహిణి. తమ కుమార్తె ప్రతిభకు వారు ముగ్ధులయ్యారు.స్వాతికి స్వీట్లు తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతానని.. పదో తరగతిలో 592 మార్కులు సాధించుకున్న పాయకరావుపేటకు చెందిన కోటిపల్లి సత్యధన స్వాతి చెప్పింది. పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆమె ఈ ఘనత సాధించింది. ఆమె తండ్రి వీరబాబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి, తల్లి గృహిణి కాగా, తమ కుమార్తె జిల్లా టాపర్గా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా నుంచి రెగ్యులర్ విద్యార్థులు 10,820 మంది బాలురు పరీక్షలు రాయగా, 9,384 మంది బాలికలు 10,349 మంది పరీక్షలు రాయగా 9,464 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 21,169 మంది విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా, 18,848 మంది ఉత్తీర్ణత సాధించారు. 14,725 మంది ప్రథమ శ్రేణి, 2,867 మంది ద్వితీయ శ్రేణి, 1,256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 86.73 శాతం, బాలికలు ఉత్తీర్ణత శాతం 91.45 శాతంగా నమోదైంది. జిల్లా మొత్తం మీద 89.04 శాతం రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. పాయకరావుపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కోటిపల్లి సత్యధన స్వాతి 600 మార్కులకు గాను 592 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, పాయకరావుపేట మండలంలో గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గట్టెం శ్రీలేఖ 590 మార్కులతో ద్వితీయ స్థానంలోను, పాయకరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాన లలిత భవాని, వాడచీపురుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దూడ రఘు 588 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది ఉత్తీర్ణత 89.04 శాతం పెరిగింది. ఫలితాల్లో దుమ్ము రేపిన కేజీబీవీలు నాతవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు) దుమ్మురేపాయి. ఇవి 97 శాతం ఉత్తీర్ణత శాాతం సాధించాయి. జిల్లాలో 20 కేజీబీవీల్లో 743 మంది పరీక్షలకు హాజరు కాగా, 608 మంది ప్రథమ శ్రేణి, 85 మంది ద్వితీయ శ్రేణి, 21 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 500పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు 148 మంది ఉన్నారు. నాతవరం రాంబిల్లి, బుచ్చెయ్యపేట, సబ్బవరం, కె.కోటపాడు, కోటవురట్ల, రోలుగుంట కేజీబీవీల్లో శత శాతం పాసయ్యారు. శతశాతం ఉత్తీర్ణత... ●అచ్యుతాపురం మండలం దోసూరు ఉన్నత పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 24 మంది పరీక్షలు రాయగా, అందరూ పాసయ్యారు. ●మునగపాక మండలం తిమ్మరాజుపేట హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 24మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు. ●అనకాపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ జ్యోతిబాయి పూలే హైస్కూల్, రైల్వే స్టేషన్ రహదారి భీమునిగుమ్మం హైస్కూల్, మండలంలో మర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ శత శాతం ఉత్తీర్ణత సాధించాయి. ●రోలుగుంట మండలం కొవ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 14 మందికి మొత్తం ఉత్తీర్ణత అయ్యారు. ●దేవరాపల్లి మండలం కాశీపురం, ఎ. కొత్తపల్లి, కలిగొట్ల, ఎం.అలమండ, ముషిడిపల్లి హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ●ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించింది. ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ●నర్సీపట్నం ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. ●రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్లో 94 మంది విద్యార్థులకు గానూ 94 మంది పాసయ్యారు. ●మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల నుంచి 69 మందికి 69 మంది, ఇదే మండలం జి. అగ్రహారం హైస్కూలు నుంచి 20 మందికి 20 మంది పాసయ్యారు. జిల్లాలో 89.04 శాతం ఉత్తీర్ణత సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు -
అట్టహాసంగా ముత్యాల నాయుడు నామినేషన్
తుమ్మపాల: వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నామినేషన్ కార్యక్రమం సోమ వారం అట్టహాసంగా జరిగింది. దేవరాపల్లి మండలం తారువ గ్రామం నుంచి ఆయన ఉదయం 11 గంటల సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. 45 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమాను లు స్వాగతం పలుకుతూ సీఎం జగన్, ఎంపీ బూడి అంటూ నీరాజనాలు పలికారు. అనకాపల్లి పట్టణంలో ఎంపీ బీవీ సత్యవతి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగ తం పలికారు. అక్కడ నుంచి జాతీయ రహదారి మీదు గా శంకరంలో కలెక్టరేట్కు చేరుకున్నారు. 1.45 నిమిషాలకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టికి సమర్పించారు. నామినేషన్ వేసి బయటకు వచ్చిన బూడిని జిల్లాలో పలువురు నాయకులు సత్కరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం మీడియాతో బూడి మాట్లాడుతూ.... మాడుగుల నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవడంతోపాటు వైఎస్సార్సీపీ కంచుకోటగా తయారు చేశామన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలను అదే విధంగా అభివృద్ధి చే యాలని ఆయా నియోజకవర్గాల ప్రజ లు, నాయకులు కోరుతున్నారన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంపీగా తనతోపాటు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సీఎం.రమేష్కు ఢిల్లీ వీధులు బాగా తెలుసట.... టీడీపీ అధినేత చంద్రబాబు కడప నుంచి దిగుమతి చేసిన సీఎం.రమేష్కు ఢిల్లీలో అన్ని వీధులు తెలుసని, తనకు తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్ప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచిన వ్యక్తికి తెలియాల్సింది ఢి ల్లీ వీదులు కాదని, పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వీధులు, గ్రామాలు తెలియాలన్నారు. ఈ ప్రాంత సమస్యలపై కనీస అవగాహన లేని రమేష్కు ఇక్కడ పనేంటన్నారు. సీఎం ఆశీస్సు లు, ప్రజల దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో తనకు కేటాయించిన క్యార్టర్స్ నుంచి పార్లమెంట్కు వెళ్తాను తప్ప ఢిల్లీ వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలదె పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం దిశగా పనిచేస్తామన్నారు. మూడు సెట్ల దాఖలు చేసిన బూడి ముత్యాలనాయుడు తారువ నుంచి కలెక్టరేట్కు వరకు 45 కిలోమీటర్ల ర్యాలీ దారి పొడవునా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి..
ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నాయకుడు గుండుబొగుల శ్రీనివాస్ నర్సీపట్నం: జనసేన నియోజకవర్గ మాజీ ఇన్చార్జి గుండుబొగుల శ్రీనివాస్ సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతను గతంలో జనసేన అనకాపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. జనసేనకు పట్టు ఉన్న నాయకుడైన శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల ఎర్రాపాత్రు డు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి
● రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ తుమ్మపాల: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో కలెక్టర్ రవి పట్టన్శెట్టి, ఎస్పీ కె.వి.మురళీకృష్ణలతో కలిసి వివిధ ఎన్నికల విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు రాజకీయంగా, ఖర్చుపరంగా పరిస్థితులు సంక్లిష్టంగా ఉండవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సునిశిత దృష్టితో మెలగుతూ ఎటువంటి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధనం, మత్తు పదార్థాలు, కానుకలతో ఓటర్లను ప్రలోభపర్చడం, వంటి పరిస్థితులను గమనించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ రకాలుగా పార్శిళ్లు, నగదు రహిత లావేదేవీల నిర్వహణకు వీలులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునే ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పోలీసు, అధికారులపై ఉంటుందన్నారు. అంతకుముందు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా స్వరూప స్వభావాలు, సరిహద్దులు, నియోజకవర్గాలు, రాజకీయు ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. జిల్లా ఎన్నికల నిర్వహణలో పని చేస్తున్న వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
మాడుగుల టీడీపీలో గందగోళం
● అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తి పేరు తెరపైకి ● శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన పైలా ప్రసాదరావు ● నిన్నమొన్నటి వరకు మూడు గ్రూపులు ● ఇప్పుడు నాలుగో వ్యక్తి తెరమీదకు ● ఎటువెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్న కార్యకర్తలు మాడుగుల: మాడుగుల టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఇప్పటికీ అభ్యర్థి విషయంలో స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు మూడు గ్రూపులుగా ఉన్న మాడుగుల టీడీపీలో తాజాగా నాలుగో వ్యక్తి తెరమీదకు రావడంతో నేతలకు పాలుపోవడం లేదు. నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులతో కలిసి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గురువారం మాడుగుల వచ్చి తనను మాడుగుల టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. మరో వైపు తానే టీడీపీ అభ్యర్థిని అని పేర్కొంటూ పైలా ప్రసాదరావు అట్టహాసంగా శుక్రవారం నామినేషన్ దాఖలుచేశా రు. ఇప్పటికే ముగ్గురు నాయకులు మధ్య వర్గపోరుతో నలిగిపోతున్న పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నాలుగో వ్యక్తి తెరమీదకు రావడంతో ఎవరి వెనుక తిరగాలి, ఎవరికి పార్టీ అధినాయకత్వం బిఫారం ఇస్తుందో తెలియక జుత్తు పీక్కుంటున్నారు. మాడుగుల అసెంబ్లీ టీడీపీ టికెట్ను పైలా ప్రసాదరావు, పీవీజీ కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆశించారు. వీరిలో పైలా ప్రసాదరావును మాడుగుల అభ్యర్థిగా గత నెల 14న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో నెల రోజులుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే తాజా బండారు తెరమీదకు వచ్చింది. బిఫారం నాకే వస్తుంది : పైలా ప్రసాదరావు నామినేషన్ అనంతరం పైలా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ కచ్చితంగా టీడీపీ బిఫారం తనకే వస్తుందని చెప్పారు. ప్యాకేజీ స్టార్గా అవతారమెత్తి తనపై కుట్రలు చేయడం మాజీ ఎమ్మెల్యే రామానాయుడుకు తగదని హితవుపలికారు. నిన్నటి మొన్నటి వరకు నాన్లోకల్ వద్దు, లోకలే ముద్దు అని ప్రచారం చేసిన వ్యక్తులు ఇప్పుడు నాన్లోకల్ అయిన బండారు సత్యనారాయణ మూర్తికి ఎలా మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు.పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని దేవుడి ఎదుట చెప్పిన పీవీజీ, రామానాయుడులు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. మాట తప్పిన వారికి కార్యకర్తలతో పాటు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బండారుకు టికెట్ ప్రకటించారని చెబుతున్నారు, మీకు బిఫారం రాకపోతే ఏంచేస్తారని విలేకరులు ప్రశ్నించగా బి ఫారం రానప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతానని పైలా సమాధానమిచ్చారు. చంద్రబాబు ఆశీస్సులతో మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు
● ఆయన పేరిట రూ.5.04 కోట్ల ఆస్తులు .. భార్య పేరిట రూ.10.82 కోట్ల ఆస్తులు విశాఖ సిటీ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అతనిపై ఉమ్మడి విశాఖ లోనే కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ●కృష్ణా జిల్లాలో జరిగిన సభలో అయ్య న్న ముఖ్యమంత్రిజగన్మోహన్రెడ్డి,మంత్రి రో జాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అత్కూర్ పోలీస్స్టేషన్లో కేసునమోదైంది. ●ప్రభుత్వ భూమి ఆక్రమించి అధికారి సంతకం ఫోర్జరీ చేసి నిర్మాణాలు చేపట్టడంతో అమరావతి సీఐడీ కేసు నమోదు చేసింది. ●సోషల్ మీడియాలో ఏయూ ప్రతిష్టకు భంగంవాటిల్లేలా పోస్టులు పెట్టించడంతో విశాఖ త్రీటౌన్లో కేసు నమోదు చేశారు. ●సభలు, సమావేశాల్లో పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, విధులకు భంగం కలిగించిన వ్యవహారాల్లో నర్సీపట్నంలోనే కాకుండా రాజమండ్రి పోలీస్స్టేషన్లో కేసులు పెట్టారు. ●గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ను, అప్పటి హోం మంత్రి సుచరితను దూషించిన వ్యవహారంలోనే కాకుండా నర్సీపట్నంలో దళితులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై అతనిపై మూడుచోట్ల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61, 500 విలువైన, అతనిభార్య పేరిట రూ.10.84, 63,200 విలువైన స్థిర,చరాస్తులు ఉన్నా య ని ఎన్నికలఅఫిడవిట్లో పేర్కొన్నారు.అయ్యన్నకు రూ.1,13,23,032, అతని భార్యకు రూ.4,79,24,824 చరాస్తులు ఉన్నాయి. ●అయ్యన్న, ఆయన భార్యకు సుమారు రూ.7 కోట్ల విలువైన స్థలాలు, భూములు, సుమారు రూ.9 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. ఇవి కాకుండా అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతికి కేజీ బంగారం ఉంది. దీని విలువ రూ.70 లక్షలు. దీంతో పాటు రూ.3.56 లక్షలు విలువ చేసే 4 కిలోల వెండి కూడా ఉంది. ఇంకా వాహనాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఉన్నాయి. అయ్యన్నకు ఎటువంటి అప్పులు, రుణాలు లేవు. అతని భార్యకు మాత్రం రూ.1,38,16,034 బ్యాంకుల నుంచి రుణాలు, ఇతరుల నుంచి రూ.1,48,57,545 రుణాలు ఉన్నాయి. -
రూ.60 కోట్ల ఆస్తి పరుడు.. కానీ కారు లేదు..
● రూ.60.18 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో కొణతాల వెల్లడి ● అతని వారసుల పేరు మీద మరో రూ.3.77 కోట్ల ఆస్తులువిశాఖ సిటీ: అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ రూ.60 కోట్ల ఆస్తిపరుడు. కానీ కారు లేదట. అతని వారసుల ఇద్దరి పేరు మీద మరో రూ.3,77,05,133 స్థిర,చరాస్తులుఉన్నాయి. వారికి కూడా ఎటువంటి వా హనం లేదు. ఈ మేరకు కొణతాల శుక్రవారం దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో ఆస్తుల వివరాలను పొందుపర్చారు. కొణతాల స్థిరాస్తులు రూ.58,97,53,200 కాగా.. చరాస్తులు రూ.1,20,77,938గాపేర్కొన్నారు. మొత్తం రూ.60,18,31,138ఆస్తులున్నట్లు తెలిపారు. ఇందులో వారసత్వ ఆస్తిగా రూ.2,34,88,200 మాత్రమే కాగా.. మిగిలిన మొత్తం తన సంపాదనగా చూపించారు. అప్పులు గానీ, రుణాలు గాని లేవు. అఫిడవిట్లో ఆస్తుల వివరాల ప్రకారం.. ●కొణతాల వద్ద ప్రస్తుతం రూ.69 వేల నగదు మాత్రమే ఉంది. ●5 బ్యాంకుల్లో రూ.8,90,108 నగదు డిపాజిట్లు ఉన్నాయి. ●అప్పులు లేకపోగా. తానే లక్ష్మీ నరసింహ ఇన్ఫ్రా డెవలపర్స్కు సుమారు రూ.95 లక్షలు వరకు రుణాలు ఇచ్చారు. ●రూ.1,531 లక్షలు విలువ చేసే 224 గ్రాముల బంగారం, రూ.72 వేలు విలువ చేసే 800 గ్రాముల వెండి ఉంది. అతని ఇద్దరు వారసులకు కూడా ఇదే మొత్తంలో బంగారం, వెండి ఉంది. ●అనకాపల్లి, మాడుగుల ప్రాంతాల్లో ఏడు చోట్ల 4.59 ఎకరాల వ్యవసాయ భూములు, అనకాపల్లిలో 3 ఎకరాల వ్యవసాయేతర భూమి, నగరంలో కంచరపాలెంలో కమర్షియల్ నిర్మాణం, అనకాపల్లి, కంచరపాలెం ప్రాంతాల్లో నివాస సముదాయాలు ఉన్నాయి. వీటివిలువ రూ.58,97,53,200.కొణతాలవారసులుఇద్దరికిచెరో రూ..1,13,14,000 స్థిరాస్తులు ఉన్నాయి. కొణతాలపై ఎటువంటి కేసులు లేవు. -
జయహో...జగనన్న
● సీఎం బస్సు యాత్రకు బ్రహ్మరథం ● పాయకరావుపేటలో ఘనంగా స్వాగతం ● హారతులిచ్చి దీవించిన మహిళలు ● జగనన్నను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులుమోగనున్న సమర శంఖం సాక్షి, అనకాపల్లి, నక్కపల్లి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా రాష్ట్ర అభ్యుదయ రథాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టింది. రాత్రి 9 గంటలకు సీఎం బస్సు యాత్ర జిల్లా సరిహద్దు పాయకరావుపేటకు చేరుకుంది. వేలాది మంది పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపైకి వచ్చి సీఎం జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కనోసా పాఠశాల నుంచి పోలీస్స్టేషన్ వరకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జాతీయరహదారి పైకి చేరుకుని ఇరువైపులా నిలుచుని పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు జగనన్నకు ఘన స్వాగతం పలికారు. తనను చూడడానికి వేలాదిగా తరలివచ్చిన జన సందోహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడులను ప్రజలకు బస్సుపై నుంచే పరిచయం చేస్తూ రెండు చేతులు జోడించి ముందుకు సాగారు. వై జంక్షన్లో మహిళలు హారతులివ్వడంతో పాటు గుమ్మడికాయలపై దీపాలు వెలిగించి దిష్టి తీసి జగనన్న బస్సుయాత్ర ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని, మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని దీవించారు. రాత్రి 9 గంటల సమయంలో కూడా పాయకరావుపేట పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది తరలిరావడంతో జాతీయ రహదారి జన సంద్రమైంది. జై జగన్.. జైజై జగన్, మళ్లీ నువ్వే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. పాయకరావుపేటలో బస్సుయాత్రకు స్వాగతం పలికినవారిలో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంఎస్ఎంఈ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ సభ్యుడు లంక సూరిబాబు, ఎస్.రాయవరం మండల అధ్యక్షుడు బోలిశెట్టి గోవింద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దత్తుడు సీత బాబు తదితరులు ఉన్నారు. గొడిచర్ల వద్ద రాత్రి బస పాయకరావుపేట నుంచి నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయరహదారి పక్కన ఏర్పాటు చేసిన వసతి వద్ద సీఎం జగన్మెహన్రెడ్డి రాత్రి బస చేశారు. గొడిచర్ల వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనూరాధ, సర్పంచ్ అల్లు రమణ, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పాపారావు, మణిరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్ల బాబూరావు, సర్పంచ్లు భార్గవ్, సురేష్ వర్మ, సాదిరెడ్డి శ్రీను, ఎంపీటీసీ తిరుపతిరావు, గోవిందు ఆధ్వర్యంలో వందలాది మంది సీఎం బస్సు యాత్రకు స్వాగతం పలికారు. ● నేడు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్ యాత్ర ● 70 కిలోమీటర్ల మేర రోడ్ షో ● కశింకోట మండలం చింతలపాలెం వద్ద భారీ బహిరంగ సభ ● చిన్నయ్యపాలెం వద్ద సీఎం రాత్రి బస సీఎం బస్సుయాత్ర జిల్లాలో శనివారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం దొడ్డిగల్లు నుంచి ప్రారంభమై నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. సీఎం పర్యటన ఇలా... సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురంలో గల లంచ్ పాయింట్ క్యాంప్కు చేరుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి సమీపంలోని చింతలపాలెం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో సీఎం వై.ఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్–1, జంక్షన్–2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్గేట్, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెంలో గల టెర్రకాన్ రాయల్ వెంచర్ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు. -
కన్నబాబు ఆస్తులు రూ.36 కోట్లు
● భార్య రాధాదేవి పేరిట రూ.రూ.14కోట్లు ● ఇద్దరి పేరిట రూ.15కోట్ల అప్పుయలమంచిలి రూరల్: యలమంచిలి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు(కన్నబాబు) ఆస్తులు రూ.36.72 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. వీటిలో చరాస్తులు సుమారు రూ.16.05 కోట్లు, స్థిరాస్తులు సుమారు రూ.20.67 కోట్లు ఉన్నాయి. భార్య రాధాదేవి పేరిట చర,స్థిరాస్తులు రూ.14.56 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. చరాస్తులు సుమారు రూ.6.39 కోట్లు, సుమారు స్థిరాస్తులు రూ.8.17 కోట్లు ఉన్నాయి. ఇద్దరికీ సొంత కారు లేదని తెలిపారు. కన్నబాబు పేరిట రూ.12.21 కోట్లు, భార్య రాధాదేవి పేరిట రూ.3.22 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో పొందుపరిచారు.కన్నబాబుపై క్రిమినల్ కేసులేవీ లేనట్టు పేర్కొన్నారు. -
దేవదాయ శాఖకు అమ్మవారి నగల అప్పగింత
ఎండోమెంట్ అధికారులకు అమ్మవారి నగలు అప్పగిస్తున్న సన్యాసిపాత్రుడు నర్సీపట్నం: స్థానిక శ్రీమరిడమ్మ వారి నగలను శుక్రవారం అమ్మవారి ఆలయంలో దేవదాయశాఖ అధికారులకు ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు అందజేశారు. ఎండోమెంట్ ఆభరణాల తనిఖీ అధికారి దుర్గాభవాని, ఈవో గంగారావు, ఆసాది పచ్చగోళ్ల ఈశ్వరరావు, మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ సమక్షంలో నగలు అప్పగించారు. తనిఖీ అధికారి నగలను తూకం వేసి వివరాలను రికార్డుల్లో నమోదు చేశారు. 510 గ్రాముల బంగారు ఆభరణాలు, ఏడున్నర కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈవో గంగారావు తెలిపారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ రుత్తల లత్సాపాత్రుడు కుటుంబ సభ్యుడైన తాను అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యుడిగా వ్యవహారించేవాడినన్నారు.ఆలయాన్ని దేవదాయశాఖలో విలీనం చేయడంతో తన దగ్గర ఉన్న అమ్మ వారి ఆభరణాలను దేవదాయశాఖ అధికారులకు అప్పగించినట్టు చెప్పారు. నగలు అప్పగింత కార్యక్రమంలో ఏకా శివకుమార్, మామిడి శ్రీను, చిటికెల కన్నబాబు, చింతకాయల వరుణ్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా కన్నబాబు రాజు నామినేషన్
నాడు.. ఒక్క అడుగు... రాష్ట్రంలో సంక్షేమ చరిత్రను లిఖించింది.. అవ్వాతాతల మోముల్లో చిరునవ్వు విరబూయించింది.. అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చింది... చిన్నారులను అమ్మ ఒడిలా లాలించి విద్యాదీవెనలు అందించింది.. ప్రతి గుండెకు ఆరోగ్య సురక్షగా నిలిచింది ప్రతి రైతుకు భరోసా ఇచ్చింది లక్షలాది మందికి నీడనిచ్చింది... ఆ మహాపథికుడు, జన హృదయాధినేత, సంక్షేమ రథసారథి నేడు కోట్లాది మంది ఆశీస్సులతో మళ్లీ మనముందుకొచ్చాడు.. ఎన్నికల సమరానికి శంఖం పూరించి... బస్సు యాత్రతో సిద్ధమై వచ్చాడు.. మండువేసవిలో చిరునవ్వుల వెన్నైలె వచ్చాడు... ఆ వెన్నెలలో తడిసి ముద్దయిన వేలాది జనం జేజేలతో సాదర స్వాగతం పలికారు... జయహో...జగనన్న అంటూ నీరాజనాలు పలికారు...సీఎంకు స్వాగతం పలకడానికి తరలివచ్చిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు -
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
తహసీల్దార్, ఆర్ఐలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
యలమంచిలి రూరల్: ఒక కేసులో కోర్టుకు హాజరు కానందుకు యలమంచిలి పూర్వ తహసీల్దార్ ఎస్.రాణీఅమ్మా జీ, పూర్వ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్భాస్కర్లకు యలమంచిలి అడిషినల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేసినట్టు న్యాయవాది ఎస్విఏ ప్రసాద్ శుక్రవారం రాత్రి తెలిపారు. తనకు తెలీకుండా తన పేరును తొలగించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అక్రమంగా జారీ చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ యలమంచిలి పట్టణానికి చెందిన కొయ్య మంగ సరస్వతి కోర్టులో కేసువేశారు. 2015లో తన కుటుంబ సభ్యులు తన తండ్రిఆస్తులను అక్రమంగా చేజిక్కించుకోవడానికి పథకం రచించి రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి అక్రమంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను పొందారనే అభియోగంపై బాధితురాలు కోర్టులో వ్యాజ్యం వేశారు. కేసు విచారణలో భాగంగా ఏ1, ఏ2లు తహసీల్దార్ రాణీ అమ్మాజీ, ఆర్ఐ విజయ్భాస్కర్లు ఈ నెల 15న కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఇద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేశారని,కేసువచ్చే నెల14వ తేదీకి వాయిదా వేశారని న్యాయవాది చెప్పారు. -
అడుగడుగునా నిబంధనల అతిక్రమణ
తుమ్మపాల: జనసేన అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నామినేషన్ ర్యాలీ కారణంగా శుక్రవారం పట్టణ వాసులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ ర్యాలీలో అడుగడుగునా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. పట్టణంలో రింగ్రోడ్డు నుంచి మెయిన్రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల నుంచి గాంధీనగరం గుండాల జంక్షన్ వద్ద గల ఆర్వో కార్యాలయానికి చేరుకునేందుకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తూ ఆయా కూడళ్లలో ఉన్న అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు గల ముసుగులను తొలగించి కొణతాలరామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ కుమారుడు రిత్విక్ పూలమాలలు వేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో పోలీసులు ఏర్పాటుచేసి న బారికేడ్లను దాటుకుని రిటర్నింగ్ అధికారి కార్యాలయం గేటు వరకు కొణతాలతో పాటు వందలాదిమంది జనం దూసుకొచ్చారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించగా కొందరు నాయకులు వారితో వాగ్వాదం చేశారు. అదే సమయంలో దాడి వీరభద్రరావు కుమారుడు జైవీర్, భీశెట్టి సుధ, పలువురు నాయకులు పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ అక్కడే మీడియా సమావేశం నిర్వహించే ప్రయత్నం చేశారు. ఎన్నికల నిబంధనలను గుర్తు చేయడంతో దూరంగా వెళ్లిపోయారు. కొణతాల రామకృష్ణతో పాటు మరో నలుగురికి మాత్రమే లోపలికి అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే నామినేషన్ కార్యక్రమానికి వచ్చి కార్యకర్తలకు అనకాపల్లి – చోడవరం రోడ్డు తుమ్మపాలలో భోజనాలు, బైకులకు పెట్రోల్ వేయించేందుకు ఇక్కడి పెట్రోల్ బంక్లో టోకెన్లు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా వాహనాలు తుమ్మపాల వైపు ప్రయాణించడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సుమారు రెండు గంటల పాటు గుండాల జంక్షన్ నుంచి తుమ్మపాల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాలలనుంచి పిల్లలతో వస్తున్న 20కి పైగా స్కూల్ బస్సులు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. ఎండ తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ర్యాలీలో చిక్కుకున్న అగ్నిమాపక శకటం ర్యాలీ కారణంగా అగ్నిమాపక శాఖ వాహనం ట్రాఫిక్లో చిక్కుకుంది. చోడవరం మండలం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది, చోడవరం అగ్నిమాపకశాఖ ఉద్యోగులు అనకాపల్లి అగ్నిమాపక శాఖ అధికా రులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. దీంతో మంటలను అదుపుచేసేందుకు అనకాపల్లి అగ్నిమాపక శాఖ వాహనం రైల్వేస్టేషన్, విజయరామరాజు రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా గోవాడ బయలుదేరింది. నామినేషన్ ర్యాలీ కారణంగాఇరువైపులాట్రాఫిక్జామ్అవడంతో అగ్నిమాపక శకటం ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. ఈలోగా చోడవరం అగ్నిమాపక శాఖ అధికారులు ఫోన్చేసి గోవాడలో మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలియజేయడంతో వాహన డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. సుమారుగా అరగంట తరువాత ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరించారు. కొణతాల నామినేషన్ ర్యాలీతో ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్లో రెండుగంటల పాటు చిక్కుకున్న స్కూల్ పిల్లల బస్సులు అగ్నిమాపక శకటానికీ అడ్డంకులు నాయకుల విగ్రహాలకు ముసుగులు తొలగించి నిబంధనలు ఉల్లంఘించిన నేతలు -
No Headline
యలమంచిలి రూరల్: వైఎస్సార్సీపీ యలమంచిలి అభ్యర్థి యు.వి.రమణమూర్తి రాజు (కన్నబాబు) శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది అభిమానులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జై జగన్..జై కన్నబాబు..జై బూడి..అన్న నినాదాలతో హోరెత్తించారు. యలమంచిలి పట్టణ వీధులు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. కళాకారుల ఆటపాటలు, డప్పుచప్పుళ్లతో పండగ వాతావరణం కనిపించింది. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రొంగలి జగన్నాథం, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ పాల్గొన్నారు. -
రెండో రోజు పార్లమెంట్కు 4, అసెంబ్లీకి 6 నామినేషన్లు
తుమ్మపాల: నామినేషన్ల పర్వంలో రెండో రోజు శుక్రవారం అనకాపల్లి లోక్సభ స్థానానికి నలుగురు, 4 శాసనసభ స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్లమెంటు స్థానానికి కోన గురువయ్యయాదవ్ (సమాజ్వాదీ పార్టీ), కర్రి విజయలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), నమ్మి అప్పలరాజు (భారత చైతన్య యువజన పార్టీ), గవిరెడ్డి రమ (స్వతంత్ర) కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి వారి వద్ద నామినేషన్ సమర్పించారు. అసెంబ్లీ స్థాలకు యలమంచిలి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు (వైఎస్సార్సీపీ) నామినేషన్ వేశారు. అనకాపల్లిలో జనసేన పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాడుగులలో టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, పైలా ఈవీఎస్ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి కరణం తిరుపతిరావు నామినేషన్లు దాఖలు చేశారు. -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
మాడుగుల రూరల్ : వీరవల్లి అగ్రహారం పంచాయతీ శివారు లక్ష్మీపురం గ్రామంలో విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల గురువారం గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. ట్రాక్టరుతో గడ్డి తీసుకెళ్తుండగా లక్ష్మీపురం గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని మాడుగుల ఆగ్ని మాపక కేంద్రం దళాధికారి వి.రాజేశ్వరావు తెలిపారు. సకాలంలో ఆగ్నిమాపక కేంద్రం ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేసినట్టు రాజేశ్వరావు తెలిపారు. సిబ్బంది రాజేశ్వరావు, బోగేశ్వరావు, మణికుమార్, మదీనా, వరహాలు పాల్గొన్నారు. మాడుగుల/రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు మాజీ మంత్రి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. గురువారం ఆయన ముకుందపురం జంక్షన్ నుంచి తన పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీగా వెళ్లి మాడుగుల మోదకొండమ్మను దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పి.వి.జి. కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు హాజరయ్యారు. పైలా వర్గం గైర్హాజరు... మాడుగుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పైలా ప్రసాదరావుకు 20 రోజుల క్రితం టికెట్ ఖరారు చేయడంతో తన కేడర్తో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారుకు టికెట్ అప్పగించడంతో వారంతా షాక్కు గురయ్యారు. బైక్ ర్యాలీకి గైర్హాజరయ్యారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న పైలా ఈ మార్పుతో బుధవారం నుంచి ప్రచారం చేపట్టలేదు. అధిష్టానం ఆదేశాలతో మాడుగుల నుంచి పోటీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి -
No Headline
పాయకరావుపేట : మండలంలో గల సత్యవరం గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు 10 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. సత్యవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. గ్రామ సర్పంచ్ సకిలేటి రాము ఆధ్వర్యంలో వీరందరికీ అభ్యర్థి కంబాల జోగులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కాకాడ పవన్ కుమార్, కాకాడ నరేష్, కండేల నాగబాబు, తుమ్మలపల్లి గోవిందు, కాకాడ వెంకటకృష్ణ, పడిది పండు, కండేల శ్రీను, అనంతరపు చిన్నబ్బాయి, తుమ్మలపల్లి రాము, తుమ్మలపల్లి అచ్చారావు లకు ఎమ్మెల్యే అభ్యర్ధి కంబాల జోగులు సాదరంగా పార్టీ కండువాలు వేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామందరం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి అనకాపల్లి : తగరంపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వైఎస్సార్సీపీలోకి గురువారం రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్, ఎంపీ బీవీ సత్యవతి 15 మంది జనసేన నేతలకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తగరంపూడి జనసేన నేత యాదగిరి విజయ్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసేవాడినని కూటమి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో జనసేన పార్టీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరడం జరిగిందన్నారు. తగరంపూడి నుంచి మరో 25 మంది జనసేన వారు మూడు నాలుగు రోజుల్లో పార్టీలోకి చేరుతారని తెలిపారు. వైస్ ఎంపీపీ అయిత రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెడిశెట్టి గోవింద్ పాల్గొన్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండిళ్లు దగ్ధం
● రూ.2లక్షలకు పైగా ఆస్తినష్టం నాతవరం: విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా తాటాకు ఇళ్లు దగ్ధమవడంతో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని ఆర్ఐ హరి గురువారం తెలిపారు. మండలంలో సరుగుడు రెవెన్యూ శివారు సుందరకోట గ్రామంలో బుధవారం రాత్రి విద్యుత్ షార్టు సర్కూట్తో గిరిజనులు నివాసం ఉంటున్న రెండు తాటాకు ఇళ్లు కాలిపోయాయి. ఆ ఇళ్లలో కూడా బ్రహ్మం, కూడా వెంకయ్యమ్మ, కూడా రాజులమ్మ, జాంపా వెంకయ్యమ్మ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్టు సర్కూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి క్షణాల్లోనూ ఇంట్లోని విలువైన వస్తువులు, నిత్యవసర సరుకులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. గురువారం ఉదయం ఆర్ఐ హరి, వీఆర్వోల బొత్స శ్రీను సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆస్తి నష్టం అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్ల ప్రకారం లెక్కిస్తే ఆస్తి నష్టం రూ. 2 లక్షలకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సంఘటన స్థలంలో పరిశీలించిన అంశాలతో పాటు బాధితులు చెప్పిన వివరాలను ఉన్నతాధికారులను నివేదిస్తామన్నారు. -
జె.పి.అగ్రహారం ఇనాం భూములపై పిటిషన్ కొట్టివేత
రోలుగుంట: మండలంలోని జె.పి.అగ్రహారంలో ఇనాం భూ పంపిణీ సక్రమంగా లేదని గ్రామానికి చెందిన దుంగల శ్రీను, కొంతమంది రైతులు కలసి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అధికారులకు లభ్యమైన రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఇనాం భూముల పంపిణీ సక్రమమేనని ఈ నెల 16న తీర్పు వెలువరించిందని ప్రభుత్వ న్యాయవాది సి.సుబోద్ గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... రెండు శతాబ్దాల క్రితం విజయనగరం రాజుల ఆధీనంలో ఉండే సర్వే నంబర్ 1 నుంచి 93 వరకూ సాగుభూమి, చెరువులు, రోడ్డు, పోరంబోకు గోర్జుతో కలిపి 408 ఎకరాలను సాగు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వర ఆలయాభివృద్ధికి వెచ్చించడంతోపాటు ధూప, దీప నైవేద్యం తదితర సేవల కోసం కొంతమంది వైష్ణవులకు అప్పగించారు. వైష్ణవుల వద్ద శ్ఙ్రీనున్నాశ్రీశ్రీ వారి కుటుంబీకులు కొనుగోలు చేసుకుని 2017లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వి.వి.వి నాగవర్మ మరో ఎనిమిది మందికి విక్రయించారు. వీరి పేరున మ్యూటేషన్ ఆధారంగా పట్టాదారు పాస్పుస్తకాలు తప్పుగా జారీ చేశారని, 1950 ఆర్డరు ప్రకారం ఈనాం భూమి కాదని, గ్రామానికి చెందిన దుంగల ఎర్రాపాత్రుడు, దుంగల శ్రీను 2022 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండేళ్ల పాటు సాగిన వాదనల అనంతరం ఈ నెల 16న హైకోర్టు పిటిషన్ కొట్టివేస్తూ.. జానకిరాంపురం అగ్రహారం ఈనాం గ్రామమని, కోర్టు ఆర్డరు ప్రకారం 1976లో సెటిల్ అయిందని స్పష్టం చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. -
No Headline
రాంబిల్లి : మండలంలో 11 సచివాలయాల పరిధిలో గల 103 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. గురువారం వీరంతా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎస్. వెంకటాచలంకు రాజీనామా లేఖలు అందజేశారు. దీంతో ఇప్పటివరకు 242 మంది వలంటీర్లు రాజీనామా చేసినట్టు ఎంపీడీవో తెలిపారు. వలంటీర్లు విధులకు దూరంగా వుండాలని ఎన్నికల సంఘం ఆదేశించడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంలో ప్రతిపక్ష పార్టీల అధినేతల ప్రమేయం ఉందని పలువురు వలంటీర్లు ఆరోపించారు. ఇది సరికాదని, దీంతో తాము రాజీనామా చేస్తున్నామని వలంటీర్లు పేర్కొన్నారు. చౌడువాడలో 33 మంది..కె.కోటపాడు : చౌడువాడ గ్రామ పంచాయతీకి చెందిన 33 మంది వలంటీర్లు గురువారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శి ఎన్.రామునాయుడుకు అందించారు. వలంటీర్ల సేవలపై మాజీ సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాజీనామా చేయడంతో తమకు ఉపాధి కల్పించిన సీఎం జగన్ను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృతనిశ్చయంతో పని చేయనున్నట్టు వలంటీర్లు పేర్కొన్నారు. మాడుగుల ఎమ్మెల్యేగా ఈర్లె అనురాధ, ఎంపీ బూడి ముత్యాలనాయుడును గెలిపించుకునేందుకు పని చేయనున్నట్టు రాజీనామా చేసిన వలంటీర్లు పార్వతీశం, రమేష్, అంజి, శివ, రామునాయుడు తదితరులు తెలిపారు. -
బయ్యవరంలో హీరో సాయిరాం ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సాయిరాంశంకర్ మాకవరపాలెం : మండలంలో రెండో రోజు కూడా సినీ హీరో, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోదరుడు సాయిరాం శంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బయ్యవరం గ్రామంలో గురువారం రాత్రి స్థానిక సర్పంచ్ లాలం కాశీ విశ్వనాథ్, వైఎస్సార్సీపీ నాయకుడు సుకల శ్రీనుతో కలసి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సాయిరాంశంకర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడి, ఈ ఎన్నికల్లో మరలా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ను గెలిపించాలని కోరారు. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సచివాలయాల మండల కన్వీనర్ చిటికెల రమణ, జిల్లా కార్యదర్శి గోవిందరావు, మండల యూత్ అధ్యక్షుడు పిల్లా శ్రీను, మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు జె.కె.రాజు పాల్గొన్నారు. -
సుందరపు విజయ్కుమార్పై 9 క్రిమినల్ కేసులు
● తన పేరున రూ.6.39 కోట్ల ఆస్తులు, భార్య పేరున రూ.53.72 లక్షలు ● ఎన్నికల అఫిడవిట్లో వివరాలు వెల్లడి యలమంచిలి రూరల్ : జనసేన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేసిన సుందరపు విజయ్ కుమార్ తనతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, ఆదాయాలు, క్రిమినల్ కేసుల వివరాల అఫిడవిట్లు సమర్పించారు. ఈ అఫిడవిట్ పరిశీలిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుందరపు విజయ్కుమార్పై మొత్తం 9 క్రిమినల్ కేసులున్నాయి. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్స్టేషన్లో రెండు, నవీ ముంబై రాబాలె ఎంఐడీసీ పోలీస్స్టేషన్లో, విశాఖ పీఎంపాలెం పోలీస్స్టేషన్లో ఒకటి, అచ్యుతాపురం పోలీస్స్టేషన్లో రెండు, రాంబిల్లి పోలీస్స్టేషన్లో ఒకటి, హరియానా రాష్ట్రం, సోనోపేట, రాయ్ పోలీస్స్టేషన్లో ఒకటి, విశాఖ టూటౌన్ పీఎస్లో ఒకటి మొత్తం 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని వివిధ దశల్లో ఆయా కోర్టుల్లో విచారణలో ఉన్నట్టు, మరికొన్ని కేసుల విచారణ గురించి తెలియదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఆస్తుల విషయానికొస్తే సుందరపు విజయ్కుమార్ వద్ద రూ.4.53 లక్షల నగదు, భార్య శైలజ వద్ద రూ.2.37లక్షల నగదు, తన పెద్ద కుమార్తె సుకీర్తి లలితా లక్ష్మిశ్రీ వద్ద రూ.36వేల నగదు ఉన్నట్టు అఫిడవిట్లో చూపారు. తన పేరున ఉన్న వివిధ బ్యాంకు అకౌంట్లలో రూ.3,08,367, తన భార్య పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్లలో రూ.12,86,001, ఇద్దరు కుమార్తెల పేరున అకౌంట్లలో రూ.1,59,403 నగదు ఉందని పేర్కొన్నారు. తన పేరున రూ.20,887, తన పెద్ద కుమార్తె పేరున రూ.5 లక్షలు, చిన్న కుమార్తె పేరుతో రూ.4,44,444 విలువ చేసే జీవిత బీమా పాలసీలు ఉన్నాయి. సుందరపు పేరున 2014లో కొనుగోలు చేసిన రూ.2,61,826 విలువ గల మహింద్రా బొలెరో మేక్సీ ట్రక్ ఉంది. తన వద్ద 101 గ్రాములు, తన భార్య వద్ద 567 గ్రాములు, పెద్ద కుమార్తె వద్ద 232 గ్రాములు, చిన్న కుమార్తె వద్ద 209 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వైజయంతి ఇన్ఫ్రాలో కేపిటల్ నిల్వ రూ.3,81,51,950 ఉంది. మొత్తంగా సుందరపు విజయ్కుమార్ చరాస్తుల విలువ రూ.3,98,81,820, భార్య శైలజ చరాస్తి విలువ రూ.53,72,931, పెద్ద కుమార్తె వద్ద రూ.22,47,713, చిన్న కుమార్తె వద్ద రూ.18,86,524 విలువ చేసే చరాస్తులున్నాయి. రూ.2.40 కోట్ల స్థిరాస్తులు సుందరపు విజయ్కుమార్ పేరిట రూ.2,40,30,000 విలువ చేసే మూడు నివాస గృహాలున్నాయి. వీటిలో విశాఖ రుషికొండ ఎంకే మేడోస్ లేఅవుట్లో 1790 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు ప్లాట్లు, అచ్యుతాపురం చోడపల్లిలో 4500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొక ప్లాట్ ఉన్నాయి. అలాగే రూ.1,89,34,612 బ్యాంకు రుణాలున్నాయి. వీటిలో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.48,38,984 విలువ కలిగిన రెండు, పీఎన్బీలో రూ.92,56,644 ఒకటి హౌసింగ్ లోన్లు ఉన్నాయి. సొంత కార్లు లేనట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపారు. -
11 ఎకరాల్లో జీడితోట దగ్ధం
రావికమతం : కొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి మణి, శాంతి, రమణమ్మ, తంటపురెడ్డి జయ, వెచ్చా కొండమ్మ అనే ఐదుగురు రైతులకు చెందిన 11 ఎకరాల్లోని జీడి తోట ప్రమాదవశాత్తూ గురువారం కాలిపోయింది. ఆకతాయిలు, మందుబాబులు ఆ తోటల్లో తరచూ పార్టీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా సిగరెట్లు కాలుస్తూ నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. పలుమార్లు అటువంటి ఆకతాయిలను ఆ రైతులు మందలించారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ అంటుకుని ఆ రైతులకు చెందిన జీడితోట కాలిపోయింది. మండే ఎండ ఆపై గాలి వీయడంతో తోటను రక్షించుకోలేకపోయామని రైతులు వాపోయారు. రావికమతం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లేకుంటే మరో 15 ఎకరాలకు మంటలు అంటుకుని ఉండేవన్నారు. ఈ ప్రమాదంలో బాధితులకు రూ. 6లక్షల వరకూ ఆస్తి నష్ట సంభవించిందని ప్రాథమిక అంచనా. ఈ ఏడాది జీడి బాగా కాసిందని రెండు రోజుల నుంచే పిక్క ఏరుతున్నామని ఇంతలోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన చెందారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
పెళ్లి సీక్రెట్గా ఉంచా.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement