చరిత్ర తెలిపే అధ్యాయం
రాజులైనా, రారాజులైనా రాజకీయాల్లో రాటుదేలిన నాయకులైనా, బుద్ధి, భుజబలం ఉన్న ఎవరైనా... స్త్రీత్వానికి లొంగక తప్పదనే సందేశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందనున్న చిత్రం ‘అధ్యాయం’. ‘ఎ మోడ్రెన్ ఎపిక్’ అనేది ఉపశీర్షిక. సతీష్ మామిడిపల్లి దర్శకుడు. శ్రీనివాస్ బండ నిర్మాత.
‘‘పురాణాల్లో కృష్ణుడు, సత్యభామ, శకుని... చలంగారి మైదానంలో అమీర్, రాజేశ్వరి పాత్రలను పోలిన విధంగా ఇందులో సూర్య, జనని, చంద్ర, తార, జీవరత్నంల పాత్రలుంటాయి. ఈ పాత్రల మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శివకల్యాణ్, కథనం: వెంకట్మిత్ర, సంగీతం: సురేష్ యువస్.