అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు సొంత పార్టీ నుంచే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన జాతీయ భద్రతా నిపుణులు 50 మంది ట్రంప్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ గెలిస్తే అమెరికాకు ఆయన ప్రమాదకర అధ్యక్షుడిగా మారుతారని, ఆయన అధ్యక్షుడైతే.. దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని వారు పేర్కొన్నారు.
50మందితో కూడిన ఈ బృందంలో గతంలో టాప్ గూఢచారులుగా, దౌత్యవేత్తలుగా పనిచేసినవారు, రిచర్డ్ నిక్సన్ నుంచి జార్జ్ బుష్ వరకు రిపబ్లికన్ ప్రభుత్వ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్కు ఎలాంటి విలువలుగానీ, వ్యక్తిత్వంగానీ లేవని, ఆయన అధ్యక్షుడైతే దేశం అన్నివిధాలుగా భ్రష్టుపట్టిపోతుందని వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. తమలో ఎవరూ కూడా ట్రంప్కు ఓటువేయబోరని స్పష్టం చేశారు. విదేశాంగ విధానం దృష్ట్యా అతడు ఏమాత్రం అధ్యక్ష పదవికిగానీ, కమాండర్ ఇన్ చీఫ్ పదవికిగానీ అర్హుడు కాదని తేల్చి పారేశారు.
'ముఖ్యంగా ట్రంప్కు వ్యక్తిత్వంగానీ, విలువలుగానీ లేవు. అధ్యక్షుడయ్యే అనుభవమూ లేదు. స్వేచ్ఛాయుత ప్రపంచ నాయకుడిగా అమెరికా నైతిక అధికారాన్ని ట్రంప్ దెబ్బతీస్తున్నారు' అంటూ పేర్కొన్న ఈ ప్రకటనలో 50మంది రిపబ్లికన్ నిపుణులు సంతకాలు చేశారు.
అయితే, ఈ ప్రకటనను డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఆ 50 మంది వాషింగ్టన్కు చెందిన సంపన్నులేనని, వారి అభిప్రాయాలే నిజమైతే ప్రపంచమిప్పుడు ఎందుకు ఇంతగా గందరగోళంగా ఉందని ట్రంప్ విమర్శించారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ కూడా ట్రంప్కు వ్యతిరేకంగా గళం ఎత్తారు. అమెరికా అధ్యక్షుడయ్యే ఏ ఒక్క అర్హత కూడా ట్రంప్కు లేదని, రిపబ్లికన్ పార్టీ చారిత్రక విలువలన్నీఆయన ఏమాత్రం పాటించడం లేదని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ట్రంప్కు సొంత పార్టీ నుంచే భారీ షాక్!
Published Tue, Aug 9 2016 3:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement