97మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం | Sakshi
Sakshi News home page

97మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం

Published Wed, Aug 31 2016 4:47 PM

97మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం - Sakshi

కాబుల్: అఫ్ఘానిస్థాన్లోని పలు ప్రావిన్స్లలో భద్రత దళాలు చేపట్టిన ఆపరేషన్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మొత్తం 97 మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చగా, మరో 24 మంది గాయపడ్డారు. అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేశారు. కాగా ఈ ఆపరేషన్లో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

పక్టియా ప్రావిన్స్లోని జని ఖేల్ జిల్లాలో అఫ్ఘాన్ భద్రత దళాల దాడిలో 57 మంది ఉగ్రవాదులు మరణించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భద్రత దళాలు పోరాడుతున్నాయని పేర్కొంది. ఇక బఘ్లాన్ ప్రావిన్స్లో మరో 15 మంది ఉగ్రవాదులను హతమార్చారని, మరో ముగ్గురు గాయపడ్డారని వెల్లడించింది. హెల్మండ్, జబుల్, కుండుజ్ ప్రావిన్స్లలో జరిపిన దాడుల్లో 25 మంది ఉగ్రవాదులు మరణించగా, మరో 21 మంది గాయపడ్డారని తెలియజేసింది. భద్రత దళాల దాడులపై తాలిబన్ గ్రూప్ ఇంకా స్పందించలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement