పట్టపగలే చోరుల చేతివాటం | Sakshi
Sakshi News home page

పట్టపగలే చోరుల చేతివాటం

Published Sun, Mar 13 2016 6:01 PM

Robbery in Padmashali Nagar

కమ్మర్‌పల్లి : నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని పద్మశాలినగర్‌లో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. కటకం కిషన్ కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి బయట గడియ పెట్టి పక్కింటికి వెళ్లగా.. అదను చూసి రంగప్రవేశం చేసిన దొంగలు మూడు గ్రాముల బంగారు గొలుసు, పది గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, చెవికమ్మలు, రూ.5వేల నగదు ఎత్తుకుపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement