♦ రికార్డు సమయంలో నిర్మాణానికి కసరత్తు
♦ రూ.వేయి కోట్లతో పనులు
♦ టెండర్ల తంతు పూర్తి, నెల రోజుల్లో పనులు షురూ
♦ వచ్చే ఏడాది దసరా నాటికి ప్రారంభోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: యుద్ధప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లకు కొత్త భవనాలు సమకూరబోతున్నాయి. రికార్డు సమయంలో ఏడాదిలోనే 26 సమీకృత జిల్లాల పరిపాలన భవనాలు, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారుల క్యాంపు క్యారాలయ భవనాలు రూపుదిద్దుకోనున్నాయి. దాదాదపు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్లు తాజాగా ఖరారయ్యాయి.
వెంటనే పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా నాటికల్లా అవి అందుబాటులోకి తేవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశించారు. స్థలసేకరణ పూర్తయిన చోట పనులు మొదలు పెట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాలకు సంబంధించి సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. వాస్తుపరంగా ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు నియమితులైన సుద్దాల సుధాకర్తేజ, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి గురువారం నుంచి స్థలాల పరిశీలన ప్రారంభించారు. ప్రభుత్వం తొలిదఫాగా రూ.600 కోట్లు విడుదల చేసింది.
అన్ని కార్యాలయాలు ఒకేచోట..: గతంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ లాంటి ప్రధాన అధికారులు సహా కొన్ని విభాగాల జిల్లా అధికారుల కార్యాలయాలు మాత్రమే ఒక చోట ఉండేవి. మిగతా కార్యాలయాలు ఎక్కడ భవనం దొరికితే అక్కడ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి విభాగాధిపతుల కార్యాలయాలన్నీ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.పర్యావరణ అనుకూల నమూనాతో హరిత భవనాలు నిర్మించనున్నారు. సమావేశ మందిరాలు, పార్కింగ్ వసతి, ఇంకుడు గుంతలు, సోలార్ వ్యవస్థ, పచ్చదనం ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు.
లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో..: ఈ భవనాలను మూడు అంతస్తుల్లో నిర్మి స్తారు. ఇందులో అవసరమైన జిల్లాల్లో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో సిద్ధం చేసి, మిగతా చోట్ల రెండు అంతస్తులను మాత్రమే అందుబాటులోకి తెస్తారు. భవిష్యత్తులో మిగతా అంతస్తును కూడా వినియోగించేలా ఏర్పాటు చేస్తారు. ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కామారెడ్డి, మేడ్చల్లో మూడంతస్తులను తొలి దశలోనే సిద్ధం చేస్తారు.
ఏడాదిలోనే కొత్త కలెక్టరేట్ భవనాలు
Published Fri, Jul 7 2017 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
హోమ్ ఓటింగ్ ప్రారంభం
రాజకీయ లబ్ధి కోసమే దుష్ప్రచారం
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
జిల్లాపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలి
ఆలోచించి ఓటు వేయండి
కేటీఆర్.., హరీశ్రావు..
హెలీప్యాడ్ ఏర్పాటును పరిశీలించిన ఎమ్మెల్యే
జిల్లాల రద్దు లీకులపై సీఎం స్పందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement