వేట కొడవళ్లతో నరికి.. నేత దారుణహత్య | Sakshi
Sakshi News home page

వేట కొడవళ్లతో నరికి.. నేత దారుణహత్య

Published Fri, Sep 15 2017 9:40 AM

వేట కొడవళ్లతో నరికి.. నేత దారుణహత్య - Sakshi

సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నేత పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. ఈ విషాదం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసరావు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామంలోని అయ్యప్ప హోటల్‌కు టిఫిన్‌ చేసేందుకు వచ్చారు.

అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరావుపై తమ వెంట తెచ్చుకున్న పెప్పర్‌ స్ప్రే కొట్టారు. దీంతో అప్రమత్తమైన శ్రీనివాసరావు అక్కడి నుంచి పరుగులు తీస్తుండగా.. దుండగులు వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్యచేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, గతంలో కూడా శ్రీనివాసరావుపై హత్యాప్రయత్నం జరిగినట్లు సమాచారం. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement