ఆప్‌లో తారాస్థాయికి విభేదాలు | Sakshi
Sakshi News home page

ఆప్‌లో తారాస్థాయికి విభేదాలు

Published Thu, Mar 5 2015 11:59 PM

ఆప్‌లో తారాస్థాయికి విభేదాలు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేజ్రీవాల్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నార్న ఆరోపణలతో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లపై వేటు వేయడం కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి జాతీయ కార్యవర్గం సభ్యుల సమావేశం వేదికగా నిలిచింది. తీర్మానానికి అధికులు మద్దతు పలికినప్పటికీ   వ్యతిరేకంగా కూడా అధికంగా ఓట్లు పడ్డాయి. దీంతో కేజ్రీవాల్‌కు మద్దతిస్తున వారు ఎంత మంది ఉన్నారో, వ్యతిరేకిస్తున్న వారు అంతే మంది ఉన్నారని తెలిపోయింది.

21 మంది సభ్యులున్న కార్యవర్గంలో 11 మంది అనుకూలంగా ఓటేశారు. 8 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకరు గైర్హాజరయ్యారు. కేజ్రీవాల్ సమావేశానికి హాజరుకాలేదు. తీర్మానాన్ని తాము ఊహించిన దాని కన్నా ఎక్కువ మంది వ్యతిరేకించడం కేజ్రీవాల్ వర్గీయులకు కూడా మింగుడుపడడం లేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement