నెక్కొండ, న్యూస్లైన్ : రోడ్డు ప్రమాద ఘటన కు సంబంధించిన కేసులో రూ.5 వేలు లంచం తీసుకుంటూ గురువారం నెక్కొండలో ఎస్సై శ్రీదేవి, గన్మన్ వీరన్న ఏసీబీకి చిక్కారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మండలంలోని సాయిరెడ్డిపల్లి గ్రామశివారు నర్సింహతండాకు చెందిన మాజీ సర్పంచ్ బానోతు హరిసింగ్నాయక్ కుమారుడు బానోతు వెంకన్న ఈ నెల 18న ట్రాక్టర్లో పత్తి లోడు చేసుకుని సాయిరెడ్డిపల్లి నుంచి నెక్కొండకు వస్తూ మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టాడు.
దీంతో ఆటో ముందు సీట్లో కూర్చున్న గొట్లకొండకు చెందిన భూక్య బిచ్చాకు కాలు విరిగింది. డ్రైవర్ వెంకన్నపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంకన్న తన తండ్రి కలిసి వెళ్లి ట్రాక్టర్ ఇవ్వాలని ఎస్సై శ్రీదేవిని కలిశాడు. ఇందుకు ఆమె రూ.10 వేలు డిమాండ్ చేయగా, రూ.2 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. చివరకు ైరూ.5 వేలు ఇస్తే ట్రాక్టర్ విడుదల చేసేందుకు ఎస్సై అంగీకరించారు. దీంతో చేసేదేమి లేక డబ్బులు చెల్లించలేక ఎస్సై అవినీతిపై వెంకన్న తండ్రి హరిసింగ్ నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు.
గురువారం ఉదయం అతడు ఎస్సైకి రూ.5 వేలు ఇచ్చేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లగా తన గన్మెన్ వీరన్నకు ఇవ్వమని ఆమె చెప్పారు. ఈ వ్యవహారాన్నంతటిని పర్యవేక్షిస్తున్న ఏసీబీ అధికారులు హరిసింగ్ నుంచి గన్మెన్ వీరన్న లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై ఆదేశాలతో తాను డబ్బులు తీసుకున్నానని వీరన్న చెప్పడంతో వెంటనే ఎస్సైని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేిసి, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సాంబయ్య, వెంకటేశ్వరరావు, రాఘవేంద్రరావు, లక్ష్మీ పాల్గొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు : డీఐజీ
వరంగల్క్రైం : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నెక్కొండ ఎస్సై శ్రీదేవి, కానిస్టేబుల్ జి.వీరన్నను విధుల నుంచి తొలగిస్తూ డీఐజీ కాంతారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీదేవి
Published Fri, Mar 28 2014 3:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement