సాక్షి, హైదరాబాద్: అడ్డూ అదుపు లేకుండా దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు చివరకు మట్టి, ఇసుకను కూడా వదలడంలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాయల్టీ కూడా చెల్లించకుండా మట్టిని తవ్వుకోవచ్చంటూ జీవోలు విడుదల చేయడం టీడీపీ సర్కారు బరితెగింపునకు నిదర్శనమన్నారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ చిన్న నీటి వనరులైన చెరువుల్లో మట్టి, ఇసుక తొలగించటంపై గతంలో ఆంక్షలుండేవి. జీవో 23 ప్రకారం వాణిజ్య అవసరాలకు మాత్రమే మట్టి, ఇసుక వాడుకునే అవకాశం ఉండేది.
చంద్రబాబు సర్కారు రెండు రోజుల క్రితం జీవో నంబర్ 40 పేరుతో బరి తెగింపు ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చు. మట్టి, ఇసుక అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి రాయల్టీ కూడా చెల్లించాల్సిన అవసరంలేదు. ఒకవైపు చెరువులు తవ్వినందుకు బిల్లులు తీసుకుంటూ మరోవైపు మట్టి అమ్ముకుంటూ టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు’ అని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.
నీరు–చెట్టుకు ఉపాధి నిధుల మళ్లింపు
‘నీరు – చెట్టు పథకం పేరుతో ఉపాధి నిధులను మళ్లించి టీడీపీ నేతలకు కోట్లు దోచి పెడుతున్నారని గడికోట ఆరోపించారు. మహిళలు, బాలికలకు రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపి దోచుకున్నదంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.
మట్టినీ మింగేస్తున్నారు
Published Thu, May 24 2018 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement