రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

Published Sat, Jan 13 2018 9:57 AM

3 died in different road accidents - Sakshi

యాదగిరిగుట్ట ( ఆలేరు) : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. యాదగిరిగుట్ట, దామరచర్ల, మునగాల మండలాల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనల వివరాలు..  మోటకొండూర్‌ మండల కేంద్రానికి చెం దిన ఉప్పలంచి ఉత్తమ్‌కుమార్‌(22) హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఉత్తమ్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించగా మరో వాహనంపై ఉన్న ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించా రు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాళ్లవాగుతండా వద్ద బాలిక
దామరచర్ల (మిర్యాలగూడ) :  మండలంలోని కొండ్రపోల్‌ గ్రామ పంచాయతీ పరిధి రాళ్లవాగుతండా  చెందిన రవీందర్‌నాయక్‌ కుమార్తె అంజలి(10) స్థానిక కాకతీయ కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదువుతోంది. ఉదయం నార్కట్‌పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారి దాటుతుండగా గుంటూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజలి అక్కడికక్కడే మృతిచెందింది.  మృతదేహాన్ని పీసీసీ కార్యదర్శి స్కైలాబ్‌నాయక్‌ సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వాడపల్లి ఎస్‌ఐ రామన్‌ గౌడ్‌ తెలిపారు.

ఆటో ఢీకొని వ్యక్తి..
మునగాల(కోదాడ): మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన పెద్ది కొండయ్య(50) ద్విచక్రవాహనంపై మోతె రోడ్డు మీదుగా తన చేను వద్దకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొండయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు దర్యాçప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement