వరంగల్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్ (24), నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన సిరిగిరి సాయిబాబా (23) ఇద్దరు జల్సాలకు అలవాటుపడ్డారు. ఆ క్రమంలో తెలికగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించారు.
అయితే ఈ రోజు మహబూబాబాద్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 12 లక్షల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 419 గ్రాముల బంగారు ఆభరణాలు, 840 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా విలేకరులకు వెల్లడించారు.