సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు అర్ధాంతరంగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుడ్డు ఎందుకివ్వడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తుంటే వారికి ఏం చెప్పాలో తెలియక అంగన్వాడీ వర్కర్లు గుడ్లు తేలేస్తున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్)లో రిజిస్ట్రేషన్ అయిన పంపిణీదారుల నుంచే కోడిగుడ్లను కొనుగోలు చేయాలని సర్కారు తాజాగా నిబంధనతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎక్కువమంది పంపిణీదారులకు నెక్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో వారి నుంచి ప్రభుత్వం కోడిగుడ్లను కొనుగోలు చేయడం మానేసింది.
పాత టెండర్లను రద్దు చేసి కొత్త నిబంధనల మేరకు టెండర్లు పిలిచేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. నెక్ రిజిస్ట్రేషన్తో పాటు పంపిణీదారుల నుంచి కొనుగోలు చేసే ప్రతి గుడ్డు కనీసం 45 గ్రాముల బరువు ఉండాలని స్థానిక పౌల్ట్రీ రైతుల నుంచే కొనుగోలు చేయాలని కొత్త నిబంధనల్లో సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిబంధనలతో బేజారెత్తిన కోడిగుడ్ల పంపిణీదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం ప్రస్తుతానికి యథాస్థితిని కొనసాగించాలని స్టే ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఆరు జిల్లాల్లో సమస్య అధికం
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులందరికీ అనుబంధ పోషకాహారం నిమిత్తం ప్రతిరోజూ ఒకపూట పూర్తి భోజనాన్ని సర్కారు అందిస్తోంది. ఈ మేరకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె.. ఇతర ఆహార పదార్థాలతో పాటు ప్రతిరోజూ ఒక గుడ్డు చొప్పున ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు 300 కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంది. అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 34 కోట్ల కోడి గుడ్లను సర్కారు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రతి కోడి గుడ్డుకు రూ.4 చొప్పున ఏడాదికి రూ.136 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ప్రభుత్వ తాజా నిబంధనల నేపథ్యంలో కోడిగుడ్ల సరఫరా 6 జిల్లాల్లో నిలిచిపోయింది. మహబూబ్నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 15 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కోర్టు స్టే ఉత్తర్వుల మేరకు కోడిగుడ్ల సరఫరా ఆగిపోయిన జిల్లాల్లో తిరిగి పునరుద్ధరించాలని, గతంలో కొనుగోలు చేసిన పంపిణీదారుల నుంచి అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు.
‘గుడ్లు’ తేలేస్తున్నారు..!
Published Sat, Nov 21 2015 9:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement