రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

Published Sat, Sep 24 2016 5:55 PM

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక - Sakshi

కడప స్పోర్ట్స్‌ :

అక్టోబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు నెల్లూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 18న నగరంలోని గాంధీనగర్‌ ఉన్నత పాఠశాలలో ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్‌ విభాగం ఖోఖో ఎంపికల్లో కళాశాల విద్యార్థులు కె. మహేష్, ఎం. తిరుమలయ్య, ఆర్‌. జయచంద్ర, జి. సురేంద్రలు ఎంపికయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎన్‌. సుబ్బనరసయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. ఎం. రవికుమార్, ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహారావు, శ్రీనివాసులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement