పసిరికల వ్యాధితో నంద్యాల ఈఓఆర్‌డీ మృతి | Sakshi
Sakshi News home page

పసిరికల వ్యాధితో నంద్యాల ఈఓఆర్‌డీ మృతి

Published Fri, Nov 25 2016 12:23 AM

jaundice disease killed nandyal eoardi

నంద్యాల రూరల్‌:
పసిరికల వ్యాధి బారిన పడి కోలుకోలేక నంద్యాల ఈఓపీఆర్‌టీ వంగాల నాగిరెడ్డి(49) మృతి చెందారు. అనారోగ్యంతో పరిస్థితి విషమిచండంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు పదిరోజుల క్రితం తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈఓఆర్‌డీ నాగిరెడ్డి మృతి పట్ల గురువారం ఇన్‌చార్జి ఎంపీడీఓ వాసుదేవగుప్త, ఎంపీపీ ప్రభాకర్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, సర్పంచ్‌లు, పీఎస్‌లు సంతాపం తెలిపారు. ఆయన స్వగ్రామమైన ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఆర్‌.జంబులదిన్నెకు భౌతికాయాన్ని తరలించారు.   
 

Advertisement
Advertisement