పాతబస్తీలో కూలిన ఆసూర్‌ఖానా గోడ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కూలిన ఆసూర్‌ఖానా గోడ: ఇద్దరి మృతి

Published Sun, Oct 4 2015 9:51 AM

పాతబస్తీలో కూలిన ఆసూర్‌ఖానా గోడ: ఇద్దరి మృతి

హైదరాబాద్: పాతబస్తీలోని హుస్సేనీ ఆలంపీఎస్పరిధిలో ఉన్న పురాతన ఇళ్లు కూలిపోయాయి. ఆదివారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం కారణంగా ఆసూర్‌ఖానా గోడ కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదర్(45), ఐతియా(35) అనే భార్యాభర్తలు కాగా, క్షతగాత్రులు ఫరీన్(13), సులేమాన్(6)లు ఉస్మానియాలో చికిత్స పొందుతున్నారు.

సంఘటనాస్థలానికి ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బాగా నాని కూలి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






 

Advertisement

తప్పక చదవండి

Advertisement