నిర్బంధించి పెళ్లి చేసుకున్న యువకుడి అరెస్టు | Sakshi
Sakshi News home page

నిర్బంధించి పెళ్లి చేసుకున్న యువకుడి అరెస్టు

Published Wed, Jan 23 2019 11:17 AM

Man Arrested For Forcibly Get Married A Woman In Karnataka - Sakshi

హొసూరు : ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని కిడ్నాప్‌ చేసి తాళి కట్టిన వ్యక్తిని మత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలోని మలయాండహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి కోయంబత్తూరులోని ప్రైవేటు పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తోంది. కొద్ది రోజులక్రితం సంక్రాంతి సెలవుల్లో సొంతూరుకు వచ్చింది. ఈ తరుణంలో సోమవారం ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా పోచ్చంపల్లి సమీపంలోని సమత్వపురానికి చెందిన వడివళగన్‌ (22) కత్తితో బెదిరించి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి తాళి కట్టాడు. ఘటనపై యువతి బంధువుల మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం వడివళగన్‌ను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement