మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

Published Sat, Sep 23 2017 5:43 PM

Suicide Shadow - Sakshi

సాక్షి, చెన్నై: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం చెన్నై నగరంలోని షోలింగనల్లూరులో చోటు చేసుకుంది. బిహార్‌ రాష్ట్రానికి చెందిన యువతి సత్య(23) షోళింగనల్లూరు యాదవ్‌ వీధిలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ అదే ప్రాంతంలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తోంది. శుక్రవారం సత్య ఆఫీస్‌కు వెళ్లలేదు. దీంతో ఆఫీసు సిబ్బంది హాస్టల్‌కు ఫోన్‌ చేసి సత్య గురించి అడిగారు.

వెంటనే సత్య ఉన్న గదికి హాస్టల్‌ నిర్వాహకులు వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు తట్టినా ఎటువంటి స్పందనాలేదు. చాలా సేపు వరకు తలుపులు తెరవలేదు. అనుమానం వచ్చిన హాస్టల్‌ నిర్వాహకులు, తలుపులు పగులగొట్టి లోపల చూడగా ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకున్న సత్య కనిపించింది. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్య ఆత్మహత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement