కర్ణాటకలో ఫలితాల అనంతరం అనిశ్చితి చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. కొరియా ద్వీపకల్పంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడం ప్రతికూల ప్రభావం చూపించింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరగడం, కొన్ని బ్యాంక్లపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్156 పాయింట్లు నష్టపోయి 35,387 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ముడి చమురు ధరలు రికవరీ కావడం, డాలర్తో రూపాయి మారకం కోలుకొని 31 పైసలు లాభపడటంతో నష్టాలు తగ్గాయి.
302 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దక్షిణ కొరియాతో ఉన్నత స్థాయి చర్చలను ఉత్తర కొరియా అనూహ్యంగా రద్దు చేయడం, అమెరికాతో శిఖరాగ్ర సమావేశాన్ని కూడా రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్ మీద కూడా పడింది. సెన్సెక్స్ 35,452 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమైంది. ఒక దశలో 302 పాయింట్ల నష్టంతో 35,242 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 102 పాయింట్ల వరకూ నష్టపోయింది.
ఏడాది కనిష్టానికి 9 బ్యాంక్ షేర్లు..: పభుత్వ బ్యాంక్లు భారీ నష్టాలను ప్రకటించడం, తాజా రుణాలు జారీ చేయకుండా కొన్ని బ్యాంక్లపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో 9 ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఆర్కామ్, రెండు అనుబంధ కంపెనీలకు వ్యతిరేకంగా రూ. 1,150 కోట్ల బకాయిల రికవరీ కోసం ఎరిక్సన్ దివాళా పిటిషన్లను ఎన్సీఎల్టీ అనుమతించింది. దీనితో అనిల్ అంబానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు నష్టపోయాయి.
బ్యాంక్ షేర్లు బేర్...
Published Thu, May 17 2018 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement