213వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Sakshi
Sakshi News home page

213వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published Sat, Jul 14 2018 8:35 PM

YS Jagan 213th Day Praja Sankalpa Yatra Schedule Released - Sakshi

సాక్షి, అనపర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం పెద్దపూడి మండలం మామిడాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి చేరుకున్న తర్వాత జననేత భోజన విరామం తీసుకుంటారు.  అనంతరం దొమ్మాడ, కరుకుడురు వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి రాజన్న బిడ్డ అక్కడే బస చేస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 212వ రోజు ప్రజాసంకల్పయాత్రను శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి పాదయాత్రను జననేత ప్రారంభించారు. అక్కడి నుంచి బిక్కవోలు, గొల్లాల మామిడాడ వరకు పాదయాత్ర కొనసాగింది.

Advertisement
Advertisement