హర్షించిన కడవెండి | The surrender of the maoist leader gvk prasad | Sakshi
Sakshi News home page

హర్షించిన కడవెండి

Jan 10 2014 2:55 AM | Updated on Sep 2 2017 2:26 AM

నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాలో మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు నేత జీవీకే ప్రసాద్ అలియాస్ ఉసెండి లొంగుబాటుపై ఆయన స్వగ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది.

కడవెండి (దేవరుప్పుల), న్యూస్‌లైన్: నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాలో మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన మావోయిస్టు నేత జీవీకే ప్రసాద్ అలియాస్ ఉసెండి లొంగుబాటుపై ఆయన స్వగ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక ప్రసాద్ మనందరితో కలిసి ఉంటాడని మిత్రులు సంతోషపడుతున్నారు. నూనుగు మీసాల వయస్సులో విద్యార్థి, యువజన, రైతు కూలీ సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన ఉసెండి ఇప్పుడు తమ వద్దకు వస్తున్నాడని తెలిసి ఆయన తలిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడుపోసిన కడవెండి నుంచి విప్లవ కళాకారుడిగా ప్రసాద్ ఉద్యమ బాట పట్టారు. ఎడాది కాలంలోనే పుపుల్స్‌వార్ రాష్ట్ర స్థాయి కోరియర్‌గా ఎదిగిన క్రమంలో రంపచోడవరంలో అరెస్టయి విడుదలయ్యారు. అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన ఉసెండి తొలుత విశాఖపట్నం సాంద్ర దళంలో సభ్యుడిగా మూడేళ్ళపాటు పనిచేశారు. 1990లో మధ్యప్రదేశ్‌తో కలిపి ఏర్పడిన దండకారణ్య ఉద్యమ విస్తరణలో దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడగానే నిర్మాణాత్మక పాత్ర పోషించడమేగాక అక్కడి నుంచే ప్రచార, పత్రిక రంగానికి అనుసంధాన కర్తగా.. రాష్ట్ర ప్రతినిధిగా ఎదిగారు.

 ఈ విధంగా ఇరవై ఎనిమిదేళ్ళ అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పి ప్రజా జీవితంలో రావడంపై కడవెండి గ్రామస్తులు స్వాగతిస్తున్నారు.  కాగా, ఉసెండి దంపతులను హైదరాబాద్ పోలీసులు గురువారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వెలువడడంతో గ్రామస్తులు ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు.

 ఊపిరి పీల్చుకున్నం : గుముడవెల్లి రాజశేఖర్, ఉసెండి తమ్ముడు
 ఇరవై ఎనిమిదేళ్ల నుంచి నిత్యం భయాందోళనే. ఏ పరిస్థితుల్లో అన్న లొంగిపోయిప్పటీకీ.. తమ్ముడిగా ఊపిరి పీల్చుకుంటున్నా. మా తల్లిదండ్రులకు పుత్రశోఖం పోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement