పెనుగంచిప్రోలు (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల మహోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఈఓ చందు హనుమంతరావు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో అందంగా ముస్తాబు చేశారు.
గురువారం ఉదయం 5.31 గంటలకు జరిగే అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శుక్రవారం నిత్య కల్యాణమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అనంతరం సామూహిక లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. ఏడో తేదీ సాయంత్రం చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. ఎనిమిదో తేదీ సాయంత్రం శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మ రథోత్సవం, తొమ్మిదో తేదీ సాయంత్రం 90 అడుగుల దివ్య ప్రభోత్సవంతో తిరునాళ్లు ముగుస్తాయని ఈవో వివరించారు.
నేటి నుంచి తిరుపతమ్మ చిన్నతిరునాళ్లు
Published Thu, Mar 5 2015 12:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement