కర్నూలు(రాజ్విహార్): జిల్లాలో రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందని ద్రాక్షలా మారింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా జిల్లాకు అవసరమైన కోటాను ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయించలేదు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో జిల్లా రైతుల్లో తీవ్ర అందోళన నెలకొంది.
ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. మరొకవైపు అర్హులైన రైతులు ఉన్నప్పటికీ కొత్త వారికి కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా జిల్లా కోటా ఊసే లేదు. దరఖాస్తు చేసుకొని ఏడాది గడిచినా కనెక్షన్లు అందక 13 వేల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. బోరు, బావుల్లో నీరు ఉన్నా పంటలు వేసుకొని పండించుకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు.
కోటా విడుదలలో జాప్యం
2014-15 సంవత్సరంలో అర్హులైన రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ జిల్లా కోటాను ప్రభుత్వం విడుదల చేయలేదు. సాధారణంగా ప్రతి ఏటా జనవరి- ఫిబ్రవరి నెలల్లో పెండింగ్ దరఖాస్తులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సిన కోటాను కోరుతూ జిల్లా అధికారులు సీఎండీకి ప్రతిపాదనలు పంపుతారు.
ఆ సంస్థలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మొత్తం సంఖ్య ఆధారంగా మొత్తం కోటా విడుదల చేయాలని సీఎండీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఈక్రమంలో ఈ ఏడాది పెండింగ్ దరఖాస్తులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 12 వేల కనెక్షన్లు మంజూరు చేయాలని 2014 మార్చిలో ప్రతిపాదనలు పంపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్లో కోటాను విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. టీడీపీ అధికారంలో వచ్చాక ఫైళ్లకు కదలిక లేకుండా పోయింది.
దీంతో ఇప్పటికే డీడీల రూపంలో రూ.5,625 చెల్లించిన 8,766 మంది రైతులు కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. డబ్బులు కట్టకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న మరో 4512 మంది రైతులు కూడా నిరీక్షిస్తున్నారు. సాధారణంగా ఏ సంవత్సర కోటాను ఆ సంవత్సరంలో రైతులకు మంజూరు చేయాల్సి ఉంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో రైతులు బాబు వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోటా వస్తుందనే ఆశతో విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు 5,662 కనెక్షన్లు రీలీజ్ చేశారు. 2004లో జిల్లాకు 5,085 కనెక్షన్లు మంజూరు చేయగా.. ప్రతి ఏడాది కోటా పెంచుతూ రెండున్నర ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు కనెక్షన్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికి దాదాపు 1.20 లక్షల కనెక్షన్లలో 1.02 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది.
‘పవర్’ఫుల్ సాగెప్పుడో?
Published Thu, Feb 26 2015 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement