జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: విజయసాయి రెడ్డి | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఎన్నికలే టార్గెట్‌: ఎంపీ విజయసాయి రెడ్డి

Published Sat, Aug 3 2019 8:55 AM

MP Vijasyasai Reddy Meets Minister Mopidevi Venkata Ramana In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడాలని  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం సన్నద్ధం కావాలని సూచించారు. శుక్రవారం విశాఖ వచ్చిన విజయసాయిరెడ్డికి ఎయిర్‌పోర్టులో జిల్లా మంత్రి, ఎంపీలు, పార్టీ నగర అధ్యక్షుడు, ముఖ్యనాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీతమ్మధారలోని ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులు విజయసాయిరెడ్డిని కలిశారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా రావడంతో ఆయన కార్యాలయం జనసంద్రంగా మారింది. 

విజయసాయిరెడ్డిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ  కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. విజయసాయిరెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజ్, గొల్ల బాబూరావు, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి,  వీఎంఆర్‌డీఏ చైర్మన్‌  ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్, ,మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దాడి వీరభద్రరావు, కోలా గురువులు, సమన్వయకర్తలు కె.కె. రాజు, అక్కరమాని విజయనిర్మల, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, డీసీసీబీ చైర్మన్‌ సుకుమారవర్మ 

రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అధికార ప్రతినిధులు జాన్‌వెస్లీ, కొయ్య ప్రసాదరెడ్డి, బెహరా భాస్కరరావు, దాడి రత్నాకర్, ముఖ్య నాయకులు ఫారుఖీ, అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, మొల్లి అప్పారావు, నగర అనుబంధసంఘాల నాయకులు పీలా వెంకటలక్ష్మి, రామన్నపాత్రుడు, కాళిదాసురెడ్డి, ముఖ్యనాయకులు శ్రీ దేవివర్మ, ఆడిటర్‌ జి.వెంకటేశ్వర్లు, కాయల వెంకటరెడ్డి,రాధా, శశికళ, బి.కాంతారావు,సనపలచంద్రమౌళి, బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి, బర్కత్‌ ఆలీ, సుధాకర్, కిరణ్‌రాజు,అక్కరమాని వెంకటరావు,  జి. శ్రీధర్‌రెడ్డి, నాయుడు బాబు, రెయ్యి వెంకటరమణ, ఎ.రాజుబాబు పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు ఇలా..
► ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి శనివారం నగరంలో పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 
► ఉదయం 9.30 గంటలకు తొట్లకొండ దగ్గర జరిగే ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
► 10 గంటలకు  బీచ్‌రోడ్డులోని ది పార్క్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడే తన ఎంపీ నిధులతో కేజీహెచ్‌కు సమకూర్చిన అంబులెన్స్‌తో పాటు రెండు ఆర్‌వో ప్లాంట్లను ప్రారంభిస్తారు. 
► 10.30 గంటలకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగే  జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొంటారు.
► సాయంత్రం 6 గంటలకు జిల్లా పరిషత్‌ రోడ్డులో ఉన్న అంకోసా హాల్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం సమావేశంలో పాల్గొంటారు. అక్కడ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించనున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement