ప్రధాన వార్తలు
జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్: సీఎం జగన్
సాక్షి, నరసాపురం: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్ అని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నరసాపురంలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కామెంట్స్..పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే. మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్రూమ్లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం. మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం. పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?. వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి అని కామెంట్స్ చేశారు.
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కేవలం పదవి కోసమే పిఠాపురం వస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారమనే ఆకలి తీర్చుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉందని మండిపడ్డారు.కాగా, ముద్రగడ పద్మనాభం శుక్రవారం పిఠాపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. యువత రాబోయే భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. ఓటర్లు చంద్రబాబు మేనిఫెస్టోను ఒక్కసారి గమనించాలి. చంద్రబాబుకు అధికారం అనే ఆకలిని తీర్చుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. అందుకే ఇలాంటి మేనిఫెస్టోను తెచ్చారు.కానీ, ఓటర్లు చాలా తెలివైన వారు. చంద్రబాబు మాటలను, హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇక, పవన్ హైదరాబాద్కే పరిమితమయ్యే వ్యక్తి. అలాంటి పవన్ సీఎం కావాలని అనుకుంటున్నాడు. పదవి కోసమే మాత్రమే పవన్ పిఠాపురం వస్తున్నాడు. ముఖానికి రంగులు వేసుకుని పవన్ వస్తున్నాడు.ఇక, ఇదే సమయంలో తన కూతురు క్రాంతి వ్యాఖ్యలపై కూడా ముద్రగడ స్పందించారు. ఈ సందర్బంగా ముద్రగడ.. కొందరు వ్యక్తులు నా కూతురితో నన్ను తిట్టించారు. ఇది చాలా బాధాకరం. నా కూతురుకు పెళ్లి అయిపోయింది.. ఇప్పుడు మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ. రాజకీయం రాజకీయమే.. కూతురు కూతురే. నేను ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరాను. ఇక, పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నాకు పదవులేమీ వద్దు. నేను కేవలం సేవకుడిని మాత్రమే’అని కామెంట్స్ చేశారు.
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారంతా ఎక్కడ?
ఏపీలో ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎందుకు కనిపించటం లేదు.. టిక్కెట్లు దక్కలేదని అలిగారా.. లేదంటే పురందేశ్వరి కుట్రా రాజకీయాలతో సీనియర్లు గుర్రుగా ఉన్నారా?. సొంత పార్టీని టీడీపీకి తాకట్టుపెట్టేసారని మండిపడుతున్నారా.. అందుకే ప్రచారాలకి దూరంగా ఉంటున్నారా?. ఎన్నికల వేళ ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం పార్టీలో దుమారం రేపుతోంది. పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు పార్టీ ప్రచారంలో ఎక్కడా పాల్గొనడం లేదు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రాత్రికి రాత్రే బీజేపీలో చేరిన వారికి సీట్లు ఇవ్వడంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఏపీలో బీజేపీ, టీడీపీ, జేనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఇక, ఎన్నికల్లో సీనియర్లు చాలా మంది ఒంటరి పోరే బీజేపీకి మంచిదని సూచించినా పురందేశ్వరితో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతల లాబీయింగ్తో పొత్తు కుదరింది కానీ.. మొదట నుంచి పొత్తులో బీజేపీకి నష్టం కలిగేలా నిర్ణయాలు జరిగాయి.టిక్కెట్ల దగ్గర నుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు అన్నీ టీడీపీ డైరక్షన్లో పురందేశ్వరి తీసుకున్న నిర్ణయాలు సీనియర్లకి రుచించలేదు. కనీసం 25 అసెంబ్లీ, ఎనిమిది ఎంపీ సీట్ల కోసం పోటీ పడిన బీజేపీకి కేవలం ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్ధానాలు దక్కాయి. ఈ స్ధానాలలో అయినా బీజేపీ అభ్యర్ధులకి అవకాశం ఇవ్వాలని.. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాదాన్యత ఉండాలని బీజేపీ సీనియర్లు ఆశించారు. అందులో భాగంగానే జీవీఎల్ విశాఖ ఎంపీ స్థానానికి, రాజమండ్రి స్థానానికి సోము వీర్రాజు, ఏలూరు పార్లమెంట్ స్థానానికి తపనా చౌదరి, హిందూపూర్కి విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు ప్రయత్నించారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు వస్తాయని భావించారు.అయితే, పురందేశ్వరి రాజకీయాలతో వీరెవరికీ టిక్కెట్లు దక్కకపోగా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లలో ప్రాధానత్య ఇచ్చి వారికే టికెట్లు కేటాయించారు. టీడీపీ సుధీర్ఘకాలంగా ఉండి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కొత్తపల్లి గీతలకి టిక్కెట్లు దక్కాయి. ఇక గతేడాది బీజేపీ చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఎంపీ టిక్కెట్లు దక్కించుకున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే దక్కాయి.అంతేకాకుండా.. చివరి నిమిషంలో టీడీపీ నుంచి రోషన్నని చేర్చుకుని బద్వేలు టిక్కెట్ ఇవ్వడం.. అనపర్తిలో మొదట ప్రకటించిన మాజీ సైనికుడిని కాదని రాత్రికి రాత్రి టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా సీనియర్లు అసహనంగా ఉన్నారు. కాగా, పురందేశ్వరి తన స్వార్ధం కోసం బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టేయడంపై సీనియర్లంతా వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక, విశాఖ టిక్కెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన జీవీఎల్ తీవ్ర మనస్థాపంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఢిల్లీకి పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇక సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ స్ధానం కోసం పోటీ పడ్డారు. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆ టిక్కెట్ దక్కడంతో మౌనంగా ఉండిపోయారు. దాదాపు నాలుగన్నర దశాబ్ధాలగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు స్ధానికుడైన తనను కాదని పురందేశ్వరికి టిక్కెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగానే ఉన్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు ఆమె నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత పురందేశ్వరి తనతో దూరంగా ఉండటంతో ఎన్నికల ప్రచారానికి సోము వీర్రాజు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఏలూరు ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించిన తపనా చౌదరి కూడా చివరి వరకు రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. అయితే, పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో వెనక్కి తగ్గిన తపనా చౌదరి ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు. జాతీయ స్ధాయి నాయకులు పాల్గొనే సభలలో మాత్రమే ఈ సీనియర్లంతా కనిపించి వెళ్లిపోతున్నారు. ఇక హిందూపూర్ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. విష్ణు వర్ధన్ రెడ్డి కేవలం రాష్ట్ర కార్యాలయానికే పరిమితమయ్యారు.మరోవైపు శ్రీపీఠం పరిపూర్ణానందస్వామి రెబెల్ అభ్యర్ధిగా కదిరి అసెంబ్లీ, హిందూపూర్ పార్లమెంట్ బరిలో నిలబడటం కూటమి నేతలకి కలవరం కలిగిస్తోంది. ఇక గన్నవరం అసెంబ్లీ నుంచి బీజేపీ రెబెల్గా బరిలో ఉన్న కొరుప్రోలు శ్రీనివాసరావుపై పార్టీ అధిష్టానం వేటువేసినప్పటికీ కూటమి పేరుతో టీడీపీకి మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలు బీజేపీని పూర్తిగా ముంచేసేలా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. కొద్దిరోజుల్లోనే జాతీయ నాయకుల ప్రచారాలు ఉండటంతో సీనియర్లు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Viveka Case: అవినాష్రెడ్డికి ఊరట
హైదరాబాద్, సాక్షి: వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్ వేశారుసీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్వైఎస్ భాస్కర్రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ వేసిందిఅని అవినాష్ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్ను కొట్టేసింది.మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్ టేక్ అవుట్కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్ వాట్సాప్లో ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
AP పాలిటిక్స్
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరి...
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్
సాక్షి, పల్నాడు: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (...
ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల రె...
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political U...
జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు
ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ఎవరి మధ్య...
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్ర...
మన్యం ప్రజలు మీ వెంటే..
పార్వతీపురం మన్యం: మన్యంలో ‘ఫ్యాన్’ జోరు తగ్గలేదు...
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గు...
వీడియోలు
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
ఈరోజే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు