శరీర సౌష్టవ పోటీల్లో సత్తా | Sakshi
Sakshi News home page

శరీర సౌష్టవ పోటీల్లో సత్తా

Published Thu, Apr 18 2024 9:30 AM

-

విశాఖ స్పోర్ట్స్‌: వాల్తేర్‌ రైల్వే డివిజన్‌లో అంతర్‌ విభాగాల శరీర సౌష్టవ పోటీల్లో ఓవరాల్‌గా ఎస్‌.సునీల్‌కుమార్‌ సత్తా చాటాడు. మెన్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో 55 కేజీల వెయిట్‌ నుంచి 90 కేజీల వెయిట్‌ వరకు పలు క్యాటగిరీల్లో పోటీలు నిర్వహించారు. కారేజ్‌, వేగన్‌ జట్లు విజేతగా నిలువగా.. సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ జట్లు రన్నరప్స్‌గా నిలిచాయి. 55–60 కేజీల వెయిట్‌లో పి.అరవింద్‌, 60–65 కేజీల్లో వై.నరసింహమూర్తి, 65–70లో ఎస్‌.సునీల్‌కుమార్‌ విజేతలయ్యారు. 75–80లో పి.సంతోష్‌కుమార్‌, 80–85లో జేడీ ప్రసాద్‌, 85–90 కేజీల వెయిట్‌లో జె.రాజ్‌కుమార్‌ విజేతలుగా నిలిచారు.

Advertisement
Advertisement