ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష

Published Fri, Nov 17 2023 1:04 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి  - Sakshi

తిరుపతి అర్బన్‌: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 21న సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఆ మేరకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని వివరించారు. సీఎం పర్యటన సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పర్యటన విజయవంతం చేయాలని సూచించారు. తిరుపతి విమానాశ్రయం, సూళ్లూరుపేట హెలీప్యాడ్‌, బహిరంగ సభ తదితర ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. మత్స్యశాఖ స్టాల్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షలో డీఆర్వో పెంచలకిషోర్‌, లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్‌డీవోలు కిరణ్‌కుమార్‌, శివశంకర్‌రెడ్డి, ప్రొటోకాల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement