రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి

Published Fri, Nov 17 2023 1:04 AM

గుర్తుతెలియని వృద్ధుడు   - Sakshi

నాయుడుపేట టౌన్‌ : మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట జీఆర్‌పీ ఎస్‌ఐ శివసౌమ్య కథనం.. బిరదవాడ గ్రామ సమీపం 217 నంబరు రైల్వే బ్రిడ్జి వద్ద ఎగువ మార్గంలో పట్టాలపై గుర్తుతెలిమని సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధుడు మృతి చెందినట్లు రైల్వే కీమన్‌ స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించారు. ఆయన సూళ్లూరుపేట జీఆర్‌పీ రైల్వే పోలీస్టేన్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద చీరాల నుంచి నాయుడుపేట వరకు తీసుకుని ఉన్న రైల్వే టిక్కెట్‌ను పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి విజయవాడ నుంచి చైన్నెకి వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రైలులో వస్తూ నాయుడుపేటలో దిగలేక రైలు కదలడంతో భయంతో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్‌ షర్టు, మెరున్‌ రెడ్‌ నైక్‌ కంపెనీ డ్రాయర్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుని చేతికి గోల్డ్‌ కలర్‌ వాచ్‌ ధరించి, మెడలో జంజము ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు గుర్తుతెలియని వృద్ధుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement
Advertisement