విశేష స్పందన | Sakshi
Sakshi News home page

విశేష స్పందన

Published Tue, Apr 23 2024 8:30 AM

-

మోడల్‌ ట్రైన్‌ ఎగ్జిబిషన్‌కు

నగరంలోని చైన్నె రైల్వే మ్యూజియంలో మూడు రోజులు పాటు జరిగిన మోడల్‌ ట్రైన్‌ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించింది. ఆదివారంతో ముగిసిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 2,500 మంది సందర్శించారు. ప్రదర్శనలో చిన్న చిన్న మోడల్‌ రైళ్లను చూసి సందర్శకులు ముగ్ధులయ్యారు. వారిలో ఎక్కువ మంది పాఠశాల చిన్నారులు కావడం విశేషం. ఇక సందర్శకులకు ఆకట్టుకునేరీతిలో చైన్నె రైల్వే మ్యూజియం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. – కొరుక్కుపేట

Advertisement
Advertisement