వడదెబ్బతో ఉపాధి వేతనదారుడు మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి వేతనదారుడు మృతి

Published Sun, May 26 2024 5:00 AM

వడదెబ్బతో ఉపాధి వేతనదారుడు మృతి

ఇచ్ఛాపురం రూరల్‌: ఉపాధి పని చేస్తూ వడదెబ్బకు గురై వేతనదారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు పంచాయతీ చిన్నలక్ష్మీపురం పెద్దగాయి నుంచి కీలువారిపుట్ట వరదగట్టుపై శనివారం ఉదయం ఉపాధి హామీ పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన దున్న దుర్యోధన(57) అస్వస్థతకు గురయ్యాడు. పని ప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు సపర్యలు చేసినప్పటికీ మృతి చెందాడు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యర్ర జోగారావు ద్వారా విషయం తెలుసుకున్న ఏపీఓ పెట్ల శ్రీనివాసరావు, వీఆర్వో ఢిల్లీరావులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయాన్ని డ్వామా పీడీ దృష్టికి తీసుకువెళ్లి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య దాలమ్మ, పెళ్‌లైన ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement